News March 17, 2024

సంగారెడ్డి: ఎన్నికల కోడ్.. విగ్రహాలకు ముసుగు

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం నుంచి ఎన్నికల నియామవళి అమలు వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన జిల్లా యంత్రాంగం సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమాల గోడ పత్రికలు, ఫ్లెక్సీలను తొలగింపజేశారు. సంగారెడ్డి పట్టణ పరిధి పోతిరెడ్డిపల్లి కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఇలా ముసుగు వేశారు. బహిరంగ ప్రదేశాల్లో వివిధ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, హార్డింగ్, కటౌట్లు కూడా తొలగిస్తున్నారు.

Similar News

News September 2, 2025

చిన్నశంకరంపేట: అనుమానాస్పదంగా వివాహిత మృతి

image

అనుమానాస్పదంగా వివాహేత మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేటలో మంగళవారం జరిగింది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన వానరాశి రాధిక(19) ఇంట్లో అనుమానాస్పదంగా ఉరేసుకుంది. స్థానికుల సమచారంతో 108 సిబ్బంది మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి అమ్మమ్మ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఎస్సై తెలిపారు.

News September 2, 2025

శాశ్వత పరిష్కారం కోసం చర్యలు: కలెక్టర్ రాహుల్ రాజ్

image

భవిష్యత్తులో ‌జిల్లాలో భారీ విపత్తులను అధిగమించే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా ‌నిర్మాణాలు చేపట్టేలా ‌ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ‌చేగుంట మండల కేంద్రంలో అనంతసాగర్‌లో వర్షాల తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను, ఇబ్రహీంపూర్‌లో తెగిన రోడ్డు, ఇతర నష్టం వాటిల్లగా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ అధికారులతో పర్యటించారు.

News September 2, 2025

మెదక్: డీవైఎస్ఓ దామోదర్ రెడ్డి బదిలీ.. డీఈఓకే బాధ్యత

image

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.