News December 2, 2024

ఇంటర్ విద్యార్థుల కోసం ‘సంకల్ప్’

image

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్-2025’ అనే కార్యక్రమాన్ని విద్యామండలి రూపొందించింది. క్వార్టర్లీ పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్లను ప్రోత్సహించేందుకు లెక్చరర్లు, ఇతర సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించింది. వీరికి ప్రత్యేకంగా క్వశ్చన్ బ్యాంకులు ఇస్తారు. ప్రతి రోజూ సా.3 నుంచి 5గంటల వరకు స్టడీ అవర్లు నిర్వహిస్తారు. ఇవాళ్టి నుంచే ఈ విధానం అమల్లోకి రానుంది.

Similar News

News January 8, 2026

విగ్రహాల శుద్ధిలో ఏ పదార్థాలు వాడాలి?

image

దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడానికి రసాయనాలు వాడకూడదు. పసుపు, కుంకుమ, విభూతి, నిమ్మరసం వంటి సహజ పదార్థాలు వాడటం ఉత్తమం. ముఖ్యంగా రాగి, ఇత్తడి విగ్రహాలను చింతపండు లేదా నిమ్మకాయతో తోమడం వల్ల అవి కొత్తవాటిలా మెరుస్తాయి. కడిగిన తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల విగ్రహాల శక్తి సడలకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి.. మంగళ, శుక్రవారాల్లో విగ్రహాలకు జల స్నానం చేయించడం నిషిద్ధం.

News January 8, 2026

మెట్రో, RTC, MMTSకి ఒకే టికెట్

image

TG: మెట్రో, MMTS, RTC సేవలను అనుసంధానం చేసే కీలక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. నెలరోజుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లలో దిగిన ప్రయాణికులు నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మూడు రవాణా సేవలకు కలిపి ఒకే టికెట్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

News January 8, 2026

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్

image

TG: ఏప్రిల్‌లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవాడికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏటా 2 విడతలుగా ఇళ్ల మంజూరు కొనసాగుతుందని, లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని అన్నారు.