News January 17, 2025
సంక్రాంతి ఎఫెక్ట్.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!

AP: రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు ₹400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో ₹150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో ₹160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29L కేసుల బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 24, 2026
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News January 24, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

గువాహటిలోని <
News January 24, 2026
రాత్రికి రాత్రే బ్రిడ్జిని మాయం చేశారు!

70 అడుగుల పొడవైన స్టీల్ బ్రిడ్జిని రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. పొద్దున లేచి చూసేసరికి అది కనిపించకపోవడంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతైంది. ఛత్తీస్గఢ్లోని కోర్బాలో జరిగిందీ ఘటన. హస్దేవ్ లెఫ్ట్ కెనాల్పై 40ఏళ్ల కిందట బ్రిడ్జి నిర్మించారు. దాని బరువు 10 టన్నులపైనే ఉంటుంది. 15మంది కలిసి బ్రిడ్జిని కట్ చేసి, తుక్కు కింద అమ్మారని పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురిని అరెస్టు చేశామని చెప్పారు.


