News September 16, 2024
ప్రయాణికులకు ‘సంక్రాంతి’ కష్టాలు.. 4 నెలల ముందే టికెట్లు క్లోజ్

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు కష్టాలు తప్పేలాలేవు. 4 నెలల ముందే రైళ్లలోని టికెట్లన్నీ అయిపోయాయి. గౌతమి, కోణార్క్, సింహపురి, గరీబ్రథ్, ఫలక్నుమా, గోదావరి, శబరి, LTT విశాఖ, ఈస్ట్కోస్ట్, చార్మినార్, వందేభారత్ రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఆ పరిమితి కూడా దాటి రిగ్రెట్ కనిపిస్తోంది. ముందుగానే ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News October 29, 2025
భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.
News October 29, 2025
అర్ష్దీప్ బదులు హర్షిత్.. నెటిజన్ల ఆగ్రహం

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అర్ష్దీప్ సింగ్ బదులు హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి తీసుకోవడంపై నెటిజన్లు టీమ్ మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్దీప్ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్కు గంభీర్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 29, 2025
ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.


