News November 19, 2024
సన్నబియ్యం పంపిణీ ఆలస్యం!

TG: రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.
Similar News
News October 23, 2025
తుని ఘటనలో సంచలన విషయాలు

AP: కాకినాడ(D) తునిలో బాలికపై వృద్ధుడి <<18071366>>లైంగికదాడి <<>>కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గురుకులలో చదువుతున్న అమ్మాయికి తినుబండారాలు కొనిచ్చి, మాయమాటలు చెప్పి నిందితుడు నారాయణరావు(62) దగ్గరయ్యాడని తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చూపిస్తానని స్కూలు నుంచి పలుమార్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అతడిపై పోక్సో సహా 3 కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
News October 23, 2025
నేడు..

* ఇవాళ <<18073538>>తెలంగాణ<<>> మంత్రివర్గ సమావేశం.. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం
* గోరక్షక్ దళ్ సభ్యుడిపై దాడికి నిరసనగా డీజీపీ ఆఫీసు ఎదుట బీజేపీ నేతల నిరసన
* వైసీపీ చీఫ్ జగన్ మీడియా <<18075756>>సమావేశం<<>>
* WWCలో న్యూజిలాండ్తో తలపడనున్న టీమ్ఇండియా
* ప్రభాస్-హను రాఘవపూడి మూవీ టైటిల్ అనౌన్స్మెంట్, ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
News October 23, 2025
బాడీలోషన్నే ముఖానికి వాడుతున్నారా?

చర్మానికి తేమను అందించడానికి చాలామంది బాడీలోషన్ వాడుతుంటారు. కానీ కొంతమంది ఈ లోషన్నే ఫేస్కి కూడా వాడుతుంటారు. దీనివల్ల ముఖంపై మొటిమలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇందులో వాడే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణం అవుతుందంటున్నారు. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.