News December 12, 2024

57 ఏళ్ల తర్వాత HYDలో సంతోష్ ఫుట్‌బాల్ టోర్నీ

image

మరో క్రీడా సంబరానికి హైదరాబాద్ సిద్ధమైంది. 1966-67లో చివరిగా భాగ్యనగరంలో సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ జరగ్గా, ఈ ఏడాది మళ్లీ ఆతిథ్యమివ్వనుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు డెక్కన్ అరేనా స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాలకు చెందిన 37 జట్లు పాల్గొననున్నాయి. CM రేవంత్ ఢిల్లీలో తాజాగా ఈ టోర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చరిత్రాత్మక టోర్నీకి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News February 7, 2026

NTR: రోడ్లపై చెత్తవేసే వారికి షాకింగ్ న్యూస్..!

image

రోడ్లపై చెత్త వేస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారికి కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడ కార్పొరేషన్ సర్కిల్-1 పరిధిలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నమోదు చేసిన 17 కేసులపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. నిబంధనలు పాటించని వారికి రూ.4,140లు జరిమానా విధించారు. నగరాన్ని అపరిశుభ్రం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని న్యాయమూర్తి హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతకు అందరూ కృషి చేయాలన్నారు.

News February 7, 2026

కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: జేడీ

image

జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ సీజన్‌కు 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించగా, ఇప్పటికే 25,404 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం మరో 4,603 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.

News February 7, 2026

కాకినాడ జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: జేడీ

image

జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. ఈ సీజన్‌కు 35,576 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించగా, ఇప్పటికే 25,404 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం మరో 4,603 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎరువుల కొరత ఉంటే వెంటనే వ్యవసాయ శాఖను సంప్రదించాలని సూచించారు.