News April 29, 2024

శ్రీలంకకు అయోధ్య నుంచి సరయూ జలాలు

image

శ్రీలంక ప్రభుత్వం తమ దేశంలో సీతాదేవి ఆలయాన్ని నిర్మించింది. వచ్చే నెల 19న దాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఆ దేశం చేసిన విజ్ఞప్తిని అనుసరించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యూపీ సర్కారు అయోధ్య నుంచి సరయూ జలాలను అక్కడికి పంపించనుంది. అయోధ్య తీర్ధ వికాస్ పరిషత్ ఈ విషయాన్ని తెలిపింది. ప్రత్యేక కలశంలో జలాల్ని పంపిస్తున్నామని, ఆ ఆలయంలో పూజలు కూడా నిర్వహిస్తామని వెల్లడించింది.

Similar News

News October 28, 2025

మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా ‘మొంథా’!

image

AP: ‘మొంథా’ తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6గంటల్లో 17kmph వేగంతో కదులుతున్నట్లు APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నంకి 230KM, కాకినాడకు 310KM, విశాఖపట్నంకి 370KM దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. మరికాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడనుందని వివరించింది. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది.

News October 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 49

image

1. శ్రీరామదాసుగా ప్రసిద్ధి చెందిన రామ భక్తుడు ఎవరు?
2. భూలోకానికి పైన ఉండే మొదటి లోకం ఏది?
3. రామ సేతువు నిర్మాణంలో ప్రధాన ఇంజినీర్లు ఎవరు?
4. యుద్ధాన్ని చూస్తూ దాన్ని ధృతరాష్ట్రునికి వివరించింది ఎవరు?
5. శివుడు తన జటాజూటంలో బంధించిన నది ఏది?
✑ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 28, 2025

అక్టోబరు ఆఖరు నుంచి మామిడి చెట్లకు నీరు వద్దు

image

మామిడిలో మంచి పూత రావాలంటే రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో భాగంగా ఇప్పటికే చెట్లకు పోషకాలు అందించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నుంచి మామిడి చెట్లు నిద్రావస్థలో ఉంటాయి. అందుకే ఈ నెలాఖరు నుంచి మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో చెట్లకు నీరు పెట్టడం వల్ల చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుందని చెబుతున్నారు.