News October 9, 2024
నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం: షర్మిల

AP: నాలుగు నెలలుగాAPPSCకి ఛైర్మన్ను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని PCC చీఫ్ YS షర్మిల మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ‘శ్వేతపత్రాలపై పెట్టిన శ్రద్ధ, ఏపీపీఎస్సీపై కూడా పెట్టాలి. తక్షణమే దానికి ఛైర్మన్ను నియమించాలి. వాయిదా వేసిన పరీక్షలతో పాటు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా షెడ్యూల్ ప్రకటించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
Similar News
News January 25, 2026
T20 WC పాక్ జట్టు ప్రకటన

T20 WCలో పాల్గొనడంపై అనుమానం వ్యక్తం చేస్తూ PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు పాక్ జట్టును ప్రకటించింది.
టీమ్: సల్మాన్ అలీ అఘా (C), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫే (WK), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (WK), సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రీది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిఖ్
News January 25, 2026
ఇన్స్టా ‘స్మృతి’లను చెరిపేసిన పలాశ్ ముచ్చల్

స్మృతి మంధాన మాజీ లవర్ పలాశ్ ముచ్చల్ తన ఇన్స్టాగ్రామ్లో ఆమెతో ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేశారు. వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. నవంబర్లో జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అవ్వగా తాజా చర్యతో వారి బంధం పర్మనెంట్గా ముగిసినట్లు స్పష్టమవుతోంది. పలాశ్ ఆర్థికంగా మోసం చేశారని, పెళ్లి వేడుకల్లో ఓ <<18940645>>అమ్మాయితో అడ్డంగా<<>> దొరికిపోయారని విజ్ఞాన్ మానే అనే వ్యక్తి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.
News January 25, 2026
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.


