News September 21, 2024

సింగరేణి కార్మికులకు సర్కార్ చేదు కబురు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ సర్కార్ సింగరేణి కార్మికుల ఆశలను అడియాశలు చేసిందని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. దసరాకు తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పిందని విమర్శించారు. ‘మా హయాంలో రూ.2,222 కోట్ల లాభాలు వస్తే రూ.710 కోట్ల బోనస్ ఇచ్చాం. కానీ ఇప్పుడు రూ.4,701 కోట్ల లాభం వచ్చినా రూ.796 కోట్లే ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మిగతా రూ.754 కోట్లు ఏమయ్యాయి?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News October 15, 2025

ఐడియా అదిరింది కానీ.. సాధ్యమేనా!

image

దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్‌లో కేజీ వెండి రూ.1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ.2,07,000 ఉంది. అంటే ఏకంగా రూ.17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్‌లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ రూ.14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

News October 15, 2025

విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్

image

కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చినవారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు.

News October 15, 2025

కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి

image

కేరళ(కొచ్చి)లోని ఆయుర్వేద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెన్యా మాజీ PM రైలా ఒడింగా(80) గుండెపోటుతో మరణించారు. ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఉ.9.52కు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఒడింగా మృతిపై FRROకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. 2008-13 కాలంలో ఆయన కెన్యా PMగా వ్యవహరించారు.