News September 9, 2025

15 ఏళ్లుగా సర్పంచ్ దొంగతనాలు.. ఎందుకంటే?

image

తమిళనాడుకు చెందిన ఓ లేడీ సర్పంచ్ 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. తిరుప్పత్తూరు జిల్లా నరియంపట్టు సర్పంచ్ భారతి(DMK) ఇటీవల బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ మెడలో గోల్డ్ చైన్ చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ను అరెస్ట్ చేశారు. డబ్బు, పలుకుబడి ఉన్నా దొంగతనం చేసినప్పుడు వచ్చే కిక్కే వేరని, అందుకే చోరీలు చేస్తున్నానని పోలీసుల విచారణలో ఆమె చెప్పడంతో అందరూ విస్తుపోయారు.

Similar News

News September 9, 2025

రామ్మోహన్ నాయుడు కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు

image

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల బిడ్డకు ఆయన ఆశీస్సులు అందజేశారు. బాబును ఎత్తుకుని ముద్దాడారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ కుమారుడికి ఆశీస్సులు అందించిన విషయం తెలిసిందే. 2017లో రామ్మోహన్, శ్రావ్య వివాహం చేసుకోగా 2021లో కూతురు(శివంకృతి) జన్మించింది. నెల క్రితం బాబు పుట్టాడు.

News September 9, 2025

BREAKING: నేపాల్ ప్రధాని రాజీనామా

image

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. <<17648801>>ఉద్రిక్త పరిస్థితుల<<>> నడుమ ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నేపాల్ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం కొత్త ప్రధాని పేరును సైన్యం ప్రకటించే అవకాశం ఉంది. కాగా వందలాది మంది నిరసనకారులు ఓలీ ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన ఇంటికి నిప్పంటించారు.

News September 9, 2025

హనుమంతుడి విగ్రహాలు నారింజ రంగులో ఎందుకు?

image

హనుమంతుడు భక్తి తత్పరుడు. ఆయన విగ్రహాలు, జెండా అన్ని నారింజ రంగులోనే దర్శనమిస్తాయి. ఓరోజు సీతాదేవి నుదుటన ఆంజనేయుడు కుంకుమను గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని అడిగాడు. అప్పుడు జానకీ దేవి ఆ సిందూరం శ్రీరాముని దీర్ఘాయువుని సూచిస్తుందని చెప్పింది. దీంతో హనుమంతుడు కూడా రాముడిపై అంతులేని ప్రేమతో తన దేహమంతటా ఆ సిందూరాన్ని పూసుకున్నాడు.