News January 8, 2025
రేపటి నుంచి SAT20: భారత్ నుంచి ఒక్కడే

రేపటి నుంచి SAT20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. క్లాసెన్, బట్లర్, జాన్సెన్, విల్ జాక్స్, మార్క్రమ్, మిల్లర్, జాసన్ రాయ్, డుప్లెసిస్, డికాక్, పూరన్, స్టొయినిస్, రషీద్ ఖాన్, పొలార్డ్, సామ్ కరన్, సాల్ట్, లివింగ్స్టోన్ వంటి స్టార్లు ఆడతారు. భారత్ నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఈ టోర్నీలో ఆడనున్నారు. పర్ల్ రాయల్స్ తరఫున ఆయన బరిలోకి దిగుతారు.
Similar News
News December 5, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన సిల్వర్ రేటు!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 5, 2025
షమీని ఎందుకు ఆడించట్లేదు: హర్భజన్

డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్నా షమీని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవట్లేదని సెలక్టర్లను మాజీ క్రికెటర్ హర్భజన్ ప్రశ్నించారు. మంచి బౌలర్లను సైడ్లైన్ చేసేస్తున్నారని అన్నారు. ‘ప్రసిద్ధ్ మంచి బౌలరే కానీ అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వైట్బాల్ క్రికెట్లో మ్యాచులు గెలిపించే బౌలర్లు ప్రస్తుత టీమ్లో లేరు’ అని పేర్కొన్నారు. నిన్న SMATలో సర్వీసెస్తో జరిగిన మ్యాచులో షమీ 4 వికెట్లు పడగొట్టారు.
News December 5, 2025
Breaking: వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

RBI గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.50 నుంచి 5.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో లోన్లు తీసుకునే వారికి ఊరట దక్కనుంది. ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం తర్వాత ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. కాగా ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, జూన్లో 50 పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది.


