News December 25, 2024

మరోసారి సత్యాగ్రహం: కాంగ్రెస్

image

నవ సత్యాగ్రహం పేరుతో మరోసారి సత్యాగ్రహ స్ఫూర్తిని రగిలించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో తెలిపింది. 1924, డిసెంబరు 26న కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీజీ పగ్గాలు స్వీకరించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బెళగావిలో రేపు ‘నవ సత్యాగ్రహ బైఠక్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో ఎల్లుండి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది.

Similar News

News December 4, 2025

Dec 11న మిస్సైల్ టెస్ట్.. NOTAMకు కేంద్రం నోటీస్

image

విశాఖ తీరంలో మిస్సైల్ పరీక్ష పరిధిని 1,050 కి.మీ నుంచి 1,190 కి.మీకు కేంద్రం విస్తరించింది. DEC 11న మిస్సైల్ పరీక్ష నిర్వహించనున్నట్టు NOTAMకు తెలిపింది. డిసెంబర్ 1-4 మధ్య నిర్వహించే టెస్ట్‌కు 3,485 కి.మీలు డేంజర్ జోన్‌గా గుర్తించాలని నోటీసులిచ్చిన కేంద్రం తర్వాత కాన్సిల్ చేసింది. ATC, రన్ వే రిపేర్లు, ఎయిర్‌స్పేస్ క్లోజింగ్స్, విమాన కార్యకలాపాలు, భద్రతా పర్యవేక్షణలో NOTAMs కీలకంగా పనిచేస్తాయి.

News December 4, 2025

పుతిన్ పర్యటన.. ఫొటోలు పంచుకున్న ప్రధాని

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. స్వయంగా ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఒకే కారులో ఇద్దరూ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి PM మోదీ కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘నా ఫ్రెండ్ అధ్యక్షుడు పుతిన్‌ను స్వాగతించినందుకు సంతోషిస్తున్నాను. రేపు మా మధ్య జరగబోయే సమావేశాల కోసం ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం మన ప్రజలకు ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్ చేశారు.

News December 4, 2025

పుతిన్ పర్యటన ప్రతి అడుగులో ‘FSO’ నిఘా

image

అత్యంత పటిష్ఠ భద్రత మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన సాగుతోంది. విదేశీ ప్రముఖుల భద్రతను ఆతిథ్య దేశాలే సహజంగా పర్యవేక్షిస్తుంటాయి. పుతిన్ పర్యటనను మాత్రం రష్యాలోని రహస్య సంస్థ ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ చూస్తుంది. ఆయన ఉండే భవనం, తీసుకొనే ఆహారం సహా ప్రతి అడుగులో పలు జాగ్రత్తలు తీసుకుంటారని మాజీ బాడీగార్డు ఒకరు తెలిపారు. పుతిన్ తినే ఫుడ్‌ను ఫస్ట్ ఓ బాడీగార్డ్ టేస్ట్ చేస్తారని చెప్పారు.