News March 23, 2025
ముంబై టీమ్లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో రాయలసీమ కింగ్స్కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.
Similar News
News December 9, 2025
గొర్రెలను కొంటున్నారా? ఈ లక్షణాలుంటే మంద వేగంగా పెరుగుతుంది

గొర్రెలను కొనేటప్పుడు ఆడ గొర్రెల వయసు ఏడాదిన్నర, 8-10kgల బరువు.. పొట్టేలు రెండేళ్ల వయసు, 10-15kgల బరువు ఉండాలి. రైతుల మంద నుంచి గొర్రెలు కొనడం మంచిది. రెండు ఈతలకు మధ్య ఎక్కువ సమయం తీసుకునే గొర్రెలు వద్దు. చూడి, మొదటిసారి ఈనిన గొర్రెలను కొంటే మంద పెరిగే ఛాన్సుంది. విత్తన పొట్టేలు, ఆడ గొర్రెల్లో ఎలాంటి లక్షణాలుంటే మంద వేగంగా పెరుగుతుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 9, 2025
రేపటి నుంచి వారికి సోషల్ మీడియా నిషేధం

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు రేపటి నుంచి SMపై నిషేధం అమలులోకి రానుంది. Insta, Facebook, Tiktok, X, Youtube, Snapchat వంటి ప్లాట్ఫాంలు ఈ జాబితాలో ఉన్నాయి. నిషేధానికి ముందు తమ ఫొటోలు, కాంటాక్టులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని సంస్థలకు భారీ జరిమానా విధించనున్నారు. మెంటల్ హెల్త్, ఆన్లైన్ బుల్లీయింగ్ నివారణ కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం తెలిపింది.
News December 9, 2025
గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత(1/2)

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లలను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.


