News March 23, 2025
ముంబై టీమ్లో సత్యనారాయణ రాజు.. ఎవరితను?

IPLలో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చారు. ముంబై టీమ్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. ఇతడిని MI రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి ఓ రొయ్యల వ్యాపారి. ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో రాయలసీమ కింగ్స్కు ఆడిన రాజు 6.15 ఎకానమీతో 8 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీలో 16, లిస్ట్ ఏ క్రికెట్లో 9, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 వికెట్లు తీశారు.
Similar News
News March 25, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం

AP: వివేకా హత్య కేసుపై SCలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. ‘MP అవినాశ్ చెప్పినట్లే సునీత, నర్రెడ్డిపై CBI అధికారి రాంసింగ్ కేసు నమోదు చేశారు. సునీత, నర్రెడ్డి, రాంసింగ్పై వివేకా PA కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును IO రాజు విచారించలేదు. తనను అవినాశ్ బెదిరించారని రాజు అంగీకరించారు. రిటైర్డ్ ASP రాజేశ్వరరెడ్డి, ASIG రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారు’ అని పేర్కొన్నట్లు సమాచారం.
News March 25, 2025
ఆస్తి పన్ను వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ

AP: ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు వరకు ప్రాపర్టీ ట్యాక్స్పై పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ జీవో జారీ చేసింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల కొన్నేళ్లుగా పేరుకుపోయిన రూ.కోట్ల బకాయిలు వసూలవుతాయని అధికారులు చెబుతున్నారు.
News March 25, 2025
ఒళ్లంతా జ్వరం పట్టినట్టు ఉంటోందా…

వారం రోజులుగా చాలామంది శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల తిరగడం, శరీరం తూలడం, కాళ్లు చేతులు లాగడం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. ఒళ్లంతా జ్వరం పట్టినట్టే ఉంటోందని వాపోతున్నారు. వాతావరణం మారడం, ఎండలు పెరగడమే దీనికి కారణమని వైద్యనిపుణులు చెప్తున్నారు. డీహైడ్రేషన్కు గురవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అవసరమైతే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్తున్నారు. మీకూ ఇలాగే ఉంటోందా?