News March 7, 2025

జన్ ఔషధీ కేంద్రాలతో రూ.30K కోట్లు ఆదా: నడ్డా

image

దేశ వ్యాప్తంగా ఉన్న 15వేల PM జన్ ఔషధీ కేంద్రాల వల్ల 10 లక్షల మంది ప్రజలు ఖరీదైన మందులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని కేంద్ర వైద్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. దీని వల్ల ప్రజలకు రూ.30వేల కోట్ల వరకు ఆదా అవుతోందన్నారు. 50-90% తక్కువ ధరలకే జన్ ఔషధీ కేంద్రాల్లో మందులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో 2వేలకు పైగా మందులు, 300 వరకు సర్జికల్ వస్తువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Similar News

News April 6, 2026

డెలివరీ ఏజెంట్స్ లిఫ్ట్ వాడొద్దా.. మీరేమంటారు?

image

ప్రస్తుతం అన్నీ డోర్ డెలివరీలే. కానీ వాటిని చేరవేసే వారికి మాత్రం కనీస గౌరవం దక్కట్లేదు. కొన్ని అపార్ట్‌మెంట్లలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడొద్దని ఆంక్షలు పెట్టి, వాడితే జరిమానాలు వేస్తున్నారు. 2AMకు కూడా మెట్లు ఎక్కి రావాలనే కస్టమర్ల ప్రవర్తన తమను అవమానపరచడమే అని ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. వారు కూడా మనుషులేనని, వారికి కనీస మర్యాద ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీ కామెంట్?

News April 6, 2026

ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి: సీఎం

image

AP: అమరావతికి YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో అన్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతి అని పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

News April 6, 2026

వచ్చే నెలలో మద్యం ధరల పెంపు?

image

TG: రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 12-15% ధరలు పెంచాలని బ్రూవరీస్ చేసిన ప్రతిపాదనల ఫైల్‌ను రిటైర్డ్‌ జడ్జితో కూడిన జుడీషియల్‌ కమిటీకి పంపింది. వారంలో నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని, ధరలు పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో కమిటీ రిపోర్టు ఆధారంగా వచ్చే నెలలో మద్యం ధరలను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.