News August 17, 2024

SBI రివార్డ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని: ఎస్పీ

image

ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఆధార్ అప్డేట్/SBI రివార్డ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ A.R దామోదర్ ప్రజలను కోరారు. మీ వాట్సప్ నంబర్‌కి Apk ఫైల్స్ పంపి, మీ ఫోన్ ‌ని హ్యాక్ చేసి సైబర్ నేరస్తులు ప్రజల నుంచి కోట్లలో డబ్బుల్ని కాజేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండండి – మీరు సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.

Similar News

News November 8, 2025

కనిగిరిలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కనిగిరిలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కూచిపూడిపల్లికి చెందిన జొన్నలగడ్డ సృజన్ (52) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 8, 2025

పెద్ద చెర్లోపల్లిలో పర్యటించనున్న CM చంద్రబాబు

image

CM చంద్రబాబు నాయుడు ఈనెల 11న పెద్ద చెర్లోపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి సీఎంఓ నుంచి సమాచారం అందిందన్నారు. మండలంలోని లింగన్నపాలెంలో MSME పార్క్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు MLA లింగన్నపాలెంకు బయలుదేరి వెళ్లారు.

News November 8, 2025

భక్త కనకదాస రచనలు అనుసరణీయం: ఎస్పీ

image

భక్త కనకదాస జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కనక దాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు. కనకదాస రచనలు, కీర్తనల ద్వారా సమాజంలోని కుల అసమానతలను రూపుమాపేందుకు కనకదాస చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఆయన రచనలు ప్రజల్లో భక్తి, సమానత్వం, న్యాయం, సత్యం వంటి విలువలను బోధించాయని పేర్కొన్నారు.