News August 14, 2025
IMPS చెల్లింపులపై ఛార్జీలు పెంపు: SBI

IMPS(ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) చెల్లింపులపై ఛార్జీలను పెంచుతూ SBI నిర్ణయం తీసుకుంది. ఆగస్టు15 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. బ్రాంచ్ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీల్లో మార్పులేదు. ఆన్లైన్లో 25 వేలు-రూ.లక్షలోపు రూ.2, రూ.లక్ష-2 లక్షలలోపు రూ.6, రూ.2 లక్షల-రూ.5 లక్షలలోపు రూ.10 ఛార్జీలు+GST చెల్లించాలి. శాలరీ అకౌంట్స్ను మినహాయించారు. కార్పొరేట్ కస్టమర్లకు ఇవి SEP 8 నుంచి అమలులోకి రానున్నాయి.
Similar News
News August 14, 2025
నేడు బలరామ జయంతి.. ఎలా పూజించాలంటే?

శ్రావణ బహుళ షష్ఠి(నేడు) రోజున బలరామ జయంతిని జరుపుకుంటారు. ఉ.8గం.-ఉ.11గం. వరకు పూజకు మంచిదని పండితులు తెలిపారు. ఈరోజు బలరాముని పూజిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ‘సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి బలరామకృష్ణుల పటాలకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. పారిజాత పూలు, శంఖు, పొగడ పూలతో పూజించాలి. పాలు, వెన్న, మీగడ, అటుకులు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండాలి’ అని చెబుతున్నారు.
News August 14, 2025
మినిమం బ్యాలెన్స్ను భారీగా పెంచిన HDFC

అర్బన్ ఏరియాల్లో నెలవారీ మినిమం బ్యాలెన్స్ను రూ.25వేలకు పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. AUG 1 తర్వాత సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది. సెమీ అర్బన్ ఏరియాల్లోనూ రూ.25వేలుగా(గతంలో రూ.5వేలు) నిర్ధారించింది. రూరల్ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచింది. ఇటీవల ICICI కూడా భారీగా మినిమం బ్యాలెన్స్ను పెంచగా తీవ్ర విమర్శలు రావడంతో <<17396156>>వెనక్కి<<>> తగ్గింది.
News August 14, 2025
జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందంటే?

AP: నిన్న కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మం.లో 27.24 సెం.మీ., గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4, దుగ్గిరాలలో 22.58, తాడికొండలో 22.50, మంగళగిరిలో 19.48, నాగాయలంకలో 19.1, పెదకాకానిలో 18.68, తుళ్లూరులో 18.02, తెనాలిలో 17.84, కోనసీమ జిల్లా డి.ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర్రులో 14.3, NTR జిల్లా నందిగామలో 13.3, ప.గో.జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.