News October 13, 2025
ఐదేళ్లలో 30శాతానికి మహిళా ఉద్యోగులు: SBI

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.
Similar News
News October 13, 2025
కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట దుర్ఘటన దర్యాప్తును సుప్రీంకోర్టు CBIకి అప్పగించింది. SEPT 27న కరూర్లో జరిగిన తమిళ వెట్రి కట్చి అధినేత విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం SIT దర్యాప్తుకు ఆదేశించింది. TN అధికారులే దర్యాప్తు చేయడంపై విజయ్ సహా కొందరు అభ్యంతరం తెలుపుతూ SCని ఆశ్రయించారు. దీంతో జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజారియా బెంచ్ CBI దర్యాప్తుకు నేడు ఆదేశించింది.
News October 13, 2025
దారుణం.. ఆరుగురు బాలురపై లైంగికదాడి

TG: హైదరాబాద్లోని సైదాబాద్ జువైనల్ హోమ్లో దారుణం జరిగింది. ఆరుగురు బాలురపై పర్యవేక్షకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దసరాకు ఇంటికి వెళ్లిన సమయంలో ఓ బాలుడు జువైనల్ హోంకు తిరిగి వెళ్లనని కన్నీరు పెట్టగా తల్లి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితుడి తల్లి పోలీసులను ఆశ్రయించగా మరో ఐదుగురిపై ఇలాగే దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 13, 2025
మద్యం తాగే మహిళలకు తీవ్ర వ్యాధుల ముప్పు

మద్యం తాగే అలవాటు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మద్యం సేవించే మహిళలకు అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. స్త్రీల శారీరక నిర్మాణం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మద్యం ఎక్కువగా సేవిస్తే క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర వ్యాధులబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.