News August 3, 2024

ఎస్సీ వర్గీకరణను AP వెంటనే అమలుచేయాలి: MRPS

image

AP: SC వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌లో వెంటనే అమలుచేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బ్యాక్‌లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని ఆయన కోరారు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ అనుబంధ ఉపకులాలకు 7శాతం, మాల అనుబంధ ఉపకులాలకు 6శాతం, రెల్లి వర్గాలకు 1శాతం, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇతర అనుబంధ కులాలకు 1శాతం ఇచ్చేలా వర్గీకరణ అమలుచేయాలని కోరారు.

Similar News

News December 11, 2025

సోనియాగాంధీతో CM రేవంత్ భేటీ

image

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించిన తీరును ఆమెకు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల వారి నుంచి సదస్సుకు వచ్చిన స్పందన, పెట్టుబడుల గురించి వివరించారు. ₹5.75 లక్షల కోట్ల ఇన్వెస్టుమెంట్లకు జరిగిన ఒప్పందాలను చెప్పారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు.

News December 11, 2025

పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడతాం: పెమ్మసాని

image

AP: అమరావతిని శాశ్వత రాజధాని చేసేలా పార్లమెంటులో ప్రస్తుత, లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ‘రాజధానిగా 2014 నుంచా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే సాంకేతిక కారణంతో బిల్లు ఆలస్యమైంది. CBN మానిటర్ చేస్తున్నారు. అనేక సంస్థలు ఇప్పటికే కొలువుదీరుతున్నాయి. BILLపై విషం కక్కుతున్న జగన్‌ను రాజకీయ సమాధి చేయాలి. AP భవిష్యత్‌ను నాశనం చేశారు’ అని దుయ్యబట్టారు.

News December 11, 2025

విషాదం.. ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి

image

TG: ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతిచెందిన ఘటన గద్వాల(D) ధరూర్‌లో జరిగింది. ఓ ఇంట్లో 2 రోజుల క్రితం ఫ్రిజ్ పేలగా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఓ మహిళ, ఆమె కొడుకు చనిపోయారు. కాగా ఫ్రిజ్‌‌‌ను గోడకు 15-20cm దూరంలో ఉంచడం, క్లీన్ చేయడం, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వైరింగ్, ప్లగ్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలతో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.