News August 3, 2024
ఎస్సీ వర్గీకరణను AP వెంటనే అమలుచేయాలి: MRPS

AP: SC వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్లో వెంటనే అమలుచేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని ఆయన కోరారు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్లలో మాదిగ అనుబంధ ఉపకులాలకు 7శాతం, మాల అనుబంధ ఉపకులాలకు 6శాతం, రెల్లి వర్గాలకు 1శాతం, ఆది ఆంధ్ర, ఆది ద్రవిడ, ఇతర అనుబంధ కులాలకు 1శాతం ఇచ్చేలా వర్గీకరణ అమలుచేయాలని కోరారు.
Similar News
News December 11, 2025
మేడిన్ ఇండియా హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది

భారతీయ రైల్వే నిర్మించిన తొలి హైడ్రోజన్ ట్రైన్కు త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన (10 కోచ్లు), అత్యంత శక్తిమంతమైన (2400 కిలోవాట్లు) హైడ్రోజన్ ట్రైన్గా ఇది గుర్తింపు పొందినట్లు చెప్పారు. రెండు డ్రైవింగ్ పవర్ కార్స్ (DPCs), ఎనిమిది ప్యాసింజర్ కోచ్లతో ఈ రైలును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.
News December 11, 2025
జాగ్రత్తగా ఓటేయండి.. గ్రామాల పురోగతికి పాటుపడండి!

TG: గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడంలో సర్పంచ్లదే కీలకపాత్ర. నోటు, క్వార్టర్, బిర్యానీకి ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లూ ఇబ్బందిపడాల్సిందే. కులం, బంధుత్వాలు, పార్టీలు చూసి అసమర్థుడికి ఓటేస్తే అధోగతే. అందుకే 24/7 అందుబాటులో ఉండే, సమస్యలపై స్పందించే నాయకుడిని ఎన్నుకోవాలి. ఇందులో యువత పాత్ర కీలకం. సమర్థుడికి <<18527601>>ఓటేసి<<>>, కుటుంబీకులతోనూ ఓట్లేయించి గ్రామాల పురోగతికి పాటుపడండి.
News December 11, 2025
భారత వాతావరణశాఖలో 134 పోస్టులు.. అప్లై చేశారా?

భారత వాతావరణ శాఖ(<


