News April 14, 2025

తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

image

TG: 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని CM రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ తెలిపారు.

Similar News

News December 19, 2025

భారీ జీతంతో AVNL ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, PhD, డిప్లొమా, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉంటే JAN 6వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్, Sr. కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,20,000+IDA, Sr. మేనేజర్‌కు రూ.70000+IDA, Jr. మేనేజర్‌కు రూ.30,000+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: avnl.co.in/

News December 19, 2025

నిత్య పూజ ఎలా చేయాలి?

image

నిత్య పూజ భగవంతుని పట్ల భక్తిని చాటుకునే ప్రక్రియ. దీనిని షోడశోపచార/పంచోపచార పద్ధతుల్లో చేయవచ్చు. స్నానం చేశాక శుభ్రమైన వస్త్రాలు ధరించి, దీపారాధనతో పూజ ప్రారంభించాలి. ముందుగా గణపతిని, ఆపై కులదైవాన్ని ధ్యానిస్తూ ఆవాహన, ఆసనం, స్నానం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఆఖరున హారతి ఇచ్చి, ఆత్మప్రదక్షిణ చేసి నమస్కరించుకోవాలి. పూజలో సామాగ్రి కంటే శుద్ధమైన మనస్సు, ఏకాగ్రత, భక్తి ముఖ్యం.

News December 19, 2025

మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు భారత్

image

అబుదాబీలో భారీ వర్షం కారణంగా భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆసియా కప్ U-19 సెమీఫైనల్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.30 గంటలకే టాస్ పడాల్సి ఉంది. కాసేపట్లో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దయితే పాయింట్ల టేబుల్‌లో టాప్‌లో ఉన్న భారత్ ఫైనల్ చేరనుంది. మరో సెమీస్‌లో బంగ్లా, పాక్‌ తలపడనున్నాయి. ఇందులో గెలిచే జట్టుతో భారత్ ఫైనల్‌ ఆడుతుంది.