News April 14, 2025

తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు

image

TG: 30 ఏళ్ల పాటు జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా నేడు రాష్ట్రంలో SC వర్గీకరణ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని CM రేవంత్ రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌‌కుమార్ రెడ్డితో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మరోవైపు, సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉత్తమ్ తెలిపారు.

Similar News

News December 12, 2025

తిరుపతి SVU ఫలితాల విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News December 12, 2025

వారికి ఇంటర్ ఎగ్జంప్షన్‌ పేపర్‌కు మార్కులు

image

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్‌ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.

News December 12, 2025

నటికి క్యాన్సర్.. పాపం ఎలా అయ్యారో చూడండి

image

టాలీవుడ్‌ సహాయ నటి వాహిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కి సుమారు ₹35లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. విషయం తెలిసిన నటి కరాటే కళ్యాణి SMలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆమె చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. అటు వాహిని త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.