News August 18, 2024

SCAM: రూ.500 కడితే రూ.7లక్షలు!

image

ఏపీలోని నెల్లూరులో మనీ స్కీమ్ పేరిట భారీ మోసం జరిగింది. పొదలకూరురోడ్డు ప్రాంతంలో విశ్వనాథ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏజెంట్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. చెన్నైలోని ఓ సంస్థ ద్వారా రూ.500 చెల్లిస్తే రూ.7లక్షలు, రూ.6,000 కడితే రూ.18లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించారు. దీంతో దాదాపు 10వేల మందికి పైగా నగదు చెల్లించి మోసపోయారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.

News December 5, 2025

FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

image

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.

News December 5, 2025

అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి

image

అమెరికాలోని బర్మింగ్‌హోమ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో చదివే 10 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.