News August 18, 2024
SCAM: రూ.500 కడితే రూ.7లక్షలు!

ఏపీలోని నెల్లూరులో మనీ స్కీమ్ పేరిట భారీ మోసం జరిగింది. పొదలకూరురోడ్డు ప్రాంతంలో విశ్వనాథ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏజెంట్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. చెన్నైలోని ఓ సంస్థ ద్వారా రూ.500 చెల్లిస్తే రూ.7లక్షలు, రూ.6,000 కడితే రూ.18లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించారు. దీంతో దాదాపు 10వేల మందికి పైగా నగదు చెల్లించి మోసపోయారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News November 11, 2025
అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

శుభకార్యాల సమయంలో చాలా మంది అరటి ఆకులో భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇది సంప్రదాయమే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. అరటి ఆకులో ఉన్న పాలీఫినాల్స్ & యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, సహజ రుచిని ఆస్వాదించవచ్చని పేర్కొంటున్నారు.
News November 11, 2025
వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.
News November 11, 2025
ఆగాకర సాగు – అనుకూల పరిస్థితులు

ఆగాకర తీగజాతి పంట. అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. అధిక కర్బన పదార్థం, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రు కలిగిన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు సాగుకు అనువైనవి. ఆగాకర అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో పంట పెరుగుదల బాగుంటుంది. 32-40 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతల మధ్య అధిక దిగుబడిని, నాణ్యతను పొందవచ్చు.


