News August 18, 2024

SCAM: రూ.500 కడితే రూ.7లక్షలు!

image

ఏపీలోని నెల్లూరులో మనీ స్కీమ్ పేరిట భారీ మోసం జరిగింది. పొదలకూరురోడ్డు ప్రాంతంలో విశ్వనాథ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏజెంట్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. చెన్నైలోని ఓ సంస్థ ద్వారా రూ.500 చెల్లిస్తే రూ.7లక్షలు, రూ.6,000 కడితే రూ.18లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించారు. దీంతో దాదాపు 10వేల మందికి పైగా నగదు చెల్లించి మోసపోయారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Similar News

News October 28, 2025

మీరు వాడే పసుపు నాణ్యమైనదేనా? ఇలా చెక్ చేయండి

image

అన్ని రకాల వంటల్లో పసుపుదే కీలకపాత్ర. అయితే ఇటీవల కల్తీ పసుపు మార్కెట్లోకి వస్తోంది. దీన్ని గుర్తించడానికి కొన్ని చిట్కాలున్నాయి. ఒక గ్లాసు వెచ్చని నీళ్లలో చెంచా పసుపు వేసి 20ని. ఉంచాలి. స్వచ్ఛమైనదైతే గ్లాస్ అడుగుకు పసుపు చేరుతుంది. పైకి తేలితే కల్తీ. అలాగే చేతిపైన కొద్దిగా పసుపు వేసి కాసేపు నలపాలి. మృదువుగా అనిపించి రంగు మారకుంటే నాణ్యమైనది. గరుకుగా ఉండి రంగు మారితే నకిలీ.

News October 28, 2025

అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం: CBN

image

AP: అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని CM చంద్రబాబు కూటమి నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ‘రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుంది. కృష్ణా, ప.గో, కోనసీమ, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. ప్రాణనష్టం పూర్తిగా తగ్గించడం, ఆస్తినష్టం నివారించేలా చర్యలు చేపట్టాం. పిల్లలు, గర్భిణులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి. అవసరమైతే కేంద్రం సాయం కోరుతాం’ అని తెలిపారు.

News October 28, 2025

కళ్ల కింద డార్క్ సర్కిల్స్.. ఇలా మాయం

image

ఒత్తిడి, హార్మోన్ల ప్రభావం, నిద్రలేమి, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల మహిళల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ సమస్యకు ఇంట్లోని పదార్థాలతోనే సహజంగా తగ్గించుకోవచ్చు. పచ్చి పాలు/బంగాళదుంప రసంలో దూదిని ముంచి కళ్ల కింద పెట్టి 20ని. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు 2సార్లు ఇలా చేయాలి. బంగాళదుంప/కీరా ముక్కను కళ్లకింద 10ని. రుద్ది నీటితో కడిగేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.