News February 25, 2025

స్కామ్: లాలూ కొడుకు, కుమార్తెకు షాక్

image

ల్యాండ్ ఫర్ జాబ్ స్కాములో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్, కుమార్తె హేమకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 11న కోర్టుకు రావాలని స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే ఆదేశించారు. ఈ హై ప్రొఫైల్ కేసులో లాలూ సహా 78 మందిపై CBI దాఖలు చేసిన తుది ఛార్జిషీటును కోర్టు పరిశీలించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జోన్లలో భూమికి బదులు ఉద్యోగాలిస్తామని అవినీతికి పాల్పడ్డారని CBI ఆరోపిస్తోంది.

Similar News

News February 1, 2026

మృత్యువుతో పోరాడి మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య

image

TG: గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ నిమ్స్‌లో వారం రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. JAN 23న ఇద్దరు స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సౌమ్యను కారుతో ఢీకొట్టారు. రివర్స్ తీస్తూ మరోసారి కారును ఆమెపై నుంచి తీసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఒక కిడ్నీ తొలగించారు.

News February 1, 2026

నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నేటి నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 10 వరకు జరిగే ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,274 సెంటర్లను, ఒకేషనల్ సబ్జెక్టుల కోసం 624 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. గత ఏడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని తొలగించారు. దీంతో ఏ కాలేజీ విద్యార్థులు అదే కళాశాలలో ఎగ్జామ్ రాయొచ్చు.

News February 1, 2026

ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన పాక్

image

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ సొంతం చేసుకుంది. నిన్న జరిగిన రెండో టీ20లో 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత పాక్ 198/5 రన్స్ చేయగా ఆసీస్ 108 రన్స్‌కే ఆలౌటైంది. తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 2018 తర్వాత ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవడం పాకిస్థాన్‌కు ఇదే తొలిసారి. మూడో టీ20 ఇవాళ జరగనుంది.