News March 29, 2024
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు, 2-10 తరగతులకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన్ సూచించింది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి వివరాలకు కేవీ <
Similar News
News November 28, 2025
మట్టి పాత్రలు ఎలా వాడాలంటే?

ప్రస్తుతం చాలామంది మట్టిపాత్రలు వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. కొత్త మట్టిపాత్రను వాడేముందు సీజనింగ్ చేయాలి. రోజంతా నీళ్లలో నానబెట్టి ఆరాక పూర్తిగా నూనె రాసి ఆరనివ్వాలి. కుండను చిన్న సెగ మీద ఉంచి మంటను పెంచుతూ వెళ్లాలి. వీటిలో ఆహారం కూడా చాలా సేపు వేడిగా ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి ఇసుక, సున్నిపిండి, బూడిద, కుంకుడు రసం వాడాలి.
News November 28, 2025
అన్నల ఆలోచన మారిందా..?

ఇటీవల మల్లోజుల, ఆశన్న వంటి అగ్రనేతలు లొంగిపోతే వారు ఉద్యమ ద్రోహులని మండిపడుతూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. కానీ JAN-1న అందరం లొంగిపోతామని ప్రకటించిన తాజా లేఖలో ఆయుధాలు వీడటమంటే ప్రజలను మోసం చేసినట్లు కాదని పేర్కొంది. ‘సంఘర్షణకు ఇది సరైన సమయం కాదు.. అందుకే ఆయుధ పోరాటం వీడుతున్నాం’ అని వివరించింది. అన్నల్లో ఆలోచన మార్పుకు కారణం.. వాస్తవం అర్థమవడమా? అన్ని దారులు మూసుకుంటున్నాయనే ఆందోళనా?
News November 28, 2025
దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. అతి భారీ వర్షాలు!

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాను గంటకు 7KM వేగంతో పయనిస్తున్నట్లు IMD వెల్లడించింది. ప్రస్తుతం శ్రీలంకకు 50KM, చెన్నైకి 540KM, పుదుచ్చేరికి 440KM దూరంలో ఉన్నట్లు తెలిపింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ NOV 30న తమిళనాడు-దక్షిణ కోస్తా తీరానికి చేరే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపటి నుంచి DEC 4 వరకు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.


