News March 29, 2024
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు, 2-10 తరగతులకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన్ సూచించింది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి వివరాలకు కేవీ <
Similar News
News December 15, 2025
ప్రియాంకకు AICC పగ్గాలు!

వరుస ఓటములతో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ప్రియాంక గాంధీకి AICC అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పుపై పలువురు నేతలు ఇప్పటికే SONIAకు లేఖలూ రాశారు. ఖర్గే అనారోగ్య కారణాలతో ఈ డిమాండ్ పెరిగింది. ఇందిర రూపురేఖలతో పాటు ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా ఉన్న ప్రియాంక రాకతో INCకి పునర్వైభవం వస్తుందని వారు భావిస్తున్నారు.
News December 15, 2025
US నుంచి వచ్చి ఓటేసిన మామ.. ఒక్క ఓటుతో గెలిచిన కోడలు

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. అందుకే తమవారికి ఓటేయడానికి కొందరు దేశవిదేశాల నుంచి వస్తున్నారు. అలా వచ్చి వేసిన ఓటే కొందరిని గెలిపించింది. నిర్మల్(D) బాగాపూర్లో ముత్యాల శ్రీవేద బరిలో నిలిచారు. దీంతో ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి ఓటేశారు. అనూహ్యంగా ఆమె ఆ ఒక్కఓటుతోనే సర్పంచ్ పీఠం ఎక్కారు. ఎన్నికల్లో శ్రీవేదకు 189, మరో అభ్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి.
News December 15, 2025
‘వారణాసి’లో మహేశ్ తండ్రిగా ప్రకాశ్ రాజ్?

సూపర్ స్టార్ మహేశ్బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘వారణాసి’ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. మహేశ్ తండ్రి పాత్ర కోసం ఆయనను తీసుకున్నట్లు వెల్లడించాయి. ఇప్పటికే ఈ పాత్ర కోసం ఇద్దరు నటులపై టెస్ట్ షూట్ చేసినా జక్కన్న సంతృప్తి చెందలేదని సమాచారం. చివరగా ఈ పాత్రకు ప్రకాశ్ రాజ్ న్యాయం చేస్తారని దర్శకధీరుడు నమ్మడంతో ఆయన సెట్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.


