News June 18, 2024
ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల

AP: రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 25న నోటిఫికేషన్ వెలువడనుంది. జులై 2 వరకు నామినేషన్ల స్వీకరణ, 3న పరిశీలన, 5 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జులై 12న ఎన్నికలు, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా, టీడీపీలో చేరడంతో సి.రామచంద్రయ్యపై అనర్హత వేటు పడటంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.
Similar News
News September 15, 2025
మీకోసం వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు: కలెక్టర్

పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు పెట్టిన దరఖాస్తు వివరాలను 1100 నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని వెల్లడించారు.
News September 15, 2025
సమ్మె విరమించమని కోరాం: భట్టి

TG: ప్రైవేటు కళాశాలలు <<17708995>>బందు<<>>కు పిలుపునిచ్చిన నేపథ్యంలో యాజమాన్యాలతో Dy.CM భట్టి విక్రమార్క అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ‘చర్చలు సానుకూలంగా సాగాయి. సమస్యలు అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు’ అని తెలిపారు. బంద్ నిర్ణయంలో కళాశాలలు వెనక్కి తగ్గట్లేదని తెలుస్తోంది. ఇవాళ మ.3 గం.కు మరోసారి చర్చలు జరగనున్నాయి.
News September 15, 2025
ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.