News July 11, 2024
అధిక ఫీజు వసూళ్లు.. తిరిగిచ్చేయాలని స్కూళ్లకు ఆదేశాలు

మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఫీజులు వసూళ్లు చేసిన ప్రైవేట్ పాఠశాలలకు షాకిచ్చింది. జబల్పూర్లోని పలు పాఠశాలలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులతో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. 2018-2024 మధ్య కాలంలో 10 పాఠశాలలు 81 వేల మంది విద్యార్థుల నుంచి రూ.64.58 కోట్ల ఫీజులు అక్రమంగా వసూలు చేసినట్లు తేల్చింది. దీంతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలని ఆయా స్కూళ్లకు నోటీసులిచ్చింది.
Similar News
News September 17, 2025
ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలి: మంత్రి

TG: ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి రాజనర్సింహ కోరారు. గత 9 ఏళ్లలో చేయని సమ్మె ఇప్పుడెందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. బకాయిలను చెల్లించాలనే డిమాండ్తో నెట్వర్క్ ఆస్పత్రులు ఇవాళ్టి నుంచి సేవలను <<17734028>>నిలిపివేసిన<<>> సంగతి తెలిసిందే.
News September 17, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

AP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ‘విశాఖలో అద్భుతమైన వాతావరణం ఉంది. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళల భద్రతలో అగ్రస్థానంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ భారత్కు అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. దేశానికి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.
News September 17, 2025
EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: EC

ఈవీఎంలపై భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయంలో మెషీన్లపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంచనున్నట్లు తెలిపింది. బిహార్ ఎన్నికల నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈవీఎం ప్యానెల్లో క్రమసంఖ్య, అభ్యర్థి పేరు, కలర్ ఫొటో, గుర్తు వరుసగా ఉంటాయి. ఇప్పటివరకు అభ్యర్థుల పేర్లు, పక్కన వారి సింబల్స్ ఉండేవి.