News November 2, 2024
మధ్యాహ్నం వరకే స్కూళ్లు.. మీరేమంటారు?

TG: కులగణన కోసం ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు 18వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను మధ్యాహ్నం <<14507983>>ఒంటిగంట <<>>వరకే నడపనున్నారు. ఇప్పటికే అడ్మిషన్లు, పుస్తకాల ఆలస్యం, టీచర్ల బదిలీలు, పదోన్నతులు, వర్షాలతో సెలవులు రావడంతో బోధనకు ఆటంకం ఏర్పడింది. దసరా, దీపావళి సెలవుల తర్వాత ఈ నెలలో చదువులు గాడినపడతాయనుకుంటే 3 వారాలు సగం పూట బడులు పెట్టడం ఏంటని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News January 19, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 19, 2026
బొగ్గు టెండర్ల పంచాయితీ.. నివేదిక కోరిన కేంద్రం!

ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. పాలసీ పరమైన లోపాలు జరిగినట్లు సమాచారం అందడంతో టెండర్ల ప్రక్రియ వివరాలు సమర్పించాలని సింగరేణిని కోరింది. సింగరేణిలో బొగ్గు మంత్రిత్వ శాఖకు 49%, తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా ఉంది. బొగ్గు శాఖ నైనీ బ్లాకులను ఎస్సీసీఎల్కు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం 2025లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది.
News January 19, 2026
బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్లైన్!

భద్రతా కారణాలతో T20 WC మ్యాచుల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ <<18885677>>కోరుతుండటం<<>> తెలిసిందే. ఈ క్రమంలో మార్పు సాధ్యం కాదని BCBకి ICC చెప్పినట్లు సమాచారం. తుది నిర్ణయం చెప్పేందుకు ఈ నెల 21 వరకు డెడ్లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ర్యాంకింగ్ ప్రకారం స్కాట్లాండ్ మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక వేదికగా WC ప్రారంభం కానుంది.


