News November 2, 2024
మధ్యాహ్నం వరకే స్కూళ్లు.. మీరేమంటారు?

TG: కులగణన కోసం ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు 18వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను మధ్యాహ్నం <<14507983>>ఒంటిగంట <<>>వరకే నడపనున్నారు. ఇప్పటికే అడ్మిషన్లు, పుస్తకాల ఆలస్యం, టీచర్ల బదిలీలు, పదోన్నతులు, వర్షాలతో సెలవులు రావడంతో బోధనకు ఆటంకం ఏర్పడింది. దసరా, దీపావళి సెలవుల తర్వాత ఈ నెలలో చదువులు గాడినపడతాయనుకుంటే 3 వారాలు సగం పూట బడులు పెట్టడం ఏంటని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News October 17, 2025
2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ రెడీ: ఇస్రో

మన సొంత స్పేస్ స్టేషన్ కల 2035 నాటికి నెరవేరనుంది. దీని ఇనిషియల్ మాడ్యూల్స్ 2027 నుంచి ఇన్స్టాల్ చేస్తామని ISRO ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ’చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్తో దాని తదుపరి ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. గగన్యాన్-3 కూడా రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్తున్నాం. టెలికాం, వెదర్, డిజాస్టర్ ఇలా అనేకరకాల మేలు జరుగుతోంది’ అని అన్నారు.
News October 17, 2025
16 నెలల్లో ₹లక్ష కోట్లకు పైగా సంక్షేమం, అభివృద్ధి: చంద్రబాబు

AP: గత 16 నెలల్లో ₹లక్ష కోట్లకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని CM CBN తెలిపారు. 2047కి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అందులో భాగమే ‘P4 జీరో పావర్టీ’ అని వివరించారు. NTR భరోసా, అన్న క్యాంటీన్లు, దీపం-2, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలన దినం సందర్భంగా అందరూ పీ4లో భాగస్వాములు కావాలని కోరారు.
News October 17, 2025
మునగ సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు ఇలా..

AP: మునగ సాగును ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం అనుసంధానించింది. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీరు పెట్టడానికి డబ్బు చెల్లిస్తుంది. 25సెంట్లలో నాటితే రెండేళ్లలో ₹38,125, 50 సెంట్లకు ₹75,148, 75 సెంట్లకు ₹1.25L, ఎకరాకు ₹1.49L ఆర్థిక భరోసా ఉంటుంది. ఈ ఏడాది 12 జిల్లాల్లో(అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, ప్రకాశం, సత్యసాయి, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి) అమలు చేస్తోంది.