News November 5, 2024
రేపట్నుంచి ఒంటిపూట బడులు

TG: రాష్ట్రంలో రేపట్నుంచి ఒంటి పూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వం చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్ల టీచర్లను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉ.9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటి పూట బడులు కొనసాగనున్నాయి. అటు ఈ సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Similar News
News January 8, 2026
దీన్దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

దీన్దయాళ్ పోర్ట్ అథారిటీ 10 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంజినీర్స్ సర్టిఫికెట్స్ ఆఫ్ కాంపిటెన్సీ/మెరైన్ ఇంజినీరింగ్ అప్రెంటిస్షిప్, BE(ఎలక్ట్రికల్), BLiSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News January 8, 2026
పరకామణిలో సంస్కరణల రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి

AP: <<18777180>>పరకామణిలో సంస్కరణల<<>>పై TTD ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కానుకల లెక్కింపునకు మెరుగైన ప్లాన్స్తో రావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి నిర్వచనం కిందికి వచ్చే నిందితుడు రవికుమార్, ఆయన ఫ్యామిలీకి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని తెలిపింది. AVSO సతీశ్ మృతిపై విచారణ వేగవంతం చేయాలని చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీకి సూచించింది.
News January 8, 2026
భూమిని కాపాడేందుకు ఈ చిన్న పని చేద్దాం!

మనలోని చిన్నమార్పు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వయంగా వాటర్ బాటిల్ క్యారీ చేయడం ద్వారా లక్షల కొద్దీ ప్లాస్టిక్ బాటిల్స్ను అరికట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 10లక్షలకు పైగా ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయిస్తే అందులో 9% మాత్రమే రీసైక్లింగ్ అవుతాయి. మిగిలినవి సముద్రాలను, భూమిని కలుషితం చేస్తున్నాయి. అందుకే స్టీల్ లేదా మళ్లీ వాడగలిగే బాటిళ్లనే క్యారీ చేయండి. SHARE IT


