News November 21, 2024
కార్మికుడిగా పనిచేస్తూ NEETలో 677 స్కోర్

కోచింగ్ తీసుకుని, 18 గంటలు చదివినా కొందరు నీట్ పరీక్ష ఫెయిల్ అవుతుంటారు. కానీ, స్క్రీన్ పగిలిన ఫోన్లో చదువుతూ 21 ఏళ్ల కార్మికుడు నీట్ను ఛేదించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన సర్ఫరాజ్ నీట్ యూజీలో 720కి 677 స్కోరుతో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈయన రోజూ 8 గంటలు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే సాయంత్రం చదువుకునేవారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు.
Similar News
News December 24, 2025
‘ఐయామ్ సారీ అమ్మా’.. డిగ్రీ విద్యార్థిని సూసైడ్

TG: ఏడేళ్ల క్రితం తండ్రి మరణం, తాజాగా తల్లికి అనారోగ్యం.. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఖమ్మం(D) కవిరాజు నగర్లో విద్యార్థిని సృజన(18) సూసైడ్ చేసుకుంది. అనారోగ్యానికి గురైన అమ్మ బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. భవిష్యత్తుపై బెంగతో మానసికంగా కుంగిపోయిన యువతి ‘ఐయామ్ సారీ అమ్మా’ అంటూ ఫొటోపై నోట్ రాసి నిన్న అఘాయిత్యానికి పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News December 24, 2025
2028లోనే ప్రజలు కాంగ్రెస్ను బొంద పెడుతారు: KTR

TG: పనికిమాలిన <<18660605>>శపథాలు<<>> చేయడం, పత్తాలేకుండా పారిపోవడం రేవంత్కు అలవాటని BRS నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతిసారి పనిచేయవు. 2028లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం. మేము ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు. రైతన్న హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతాం’ అని Xలో ఫైరయ్యారు.
News December 24, 2025
‘భారత్ నీళ్లు ఆపేస్తోంది’.. పాక్ ఆరోపణల్లో నిజమెంత?

వాతావరణ పరిస్థితులు, మంచు కరగడం, డ్యామ్ కార్యకలాపాలు సహా పలు అంశాలపై నీటి ప్రవాహ వేగం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నీటిని నిలిపేసి, ఒకేసారి విడుదల చేస్తూ IND ఇబ్బంది <<18651568>>పెడుతోందని<<>> PAK చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండస్ వాటర్ ఒప్పందాన్ని IND రద్దు చేసింది. దీంతో తాము నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని PAK అంటోంది.


