News November 21, 2024
కార్మికుడిగా పనిచేస్తూ NEETలో 677 స్కోర్

కోచింగ్ తీసుకుని, 18 గంటలు చదివినా కొందరు నీట్ పరీక్ష ఫెయిల్ అవుతుంటారు. కానీ, స్క్రీన్ పగిలిన ఫోన్లో చదువుతూ 21 ఏళ్ల కార్మికుడు నీట్ను ఛేదించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన సర్ఫరాజ్ నీట్ యూజీలో 720కి 677 స్కోరుతో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈయన రోజూ 8 గంటలు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే సాయంత్రం చదువుకునేవారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు.
Similar News
News December 8, 2025
‘స్మృతి ఈజ్ బ్యాక్’.. ప్రాక్టీస్ షురూ

పలాశ్ ముచ్చల్తో పెళ్లి రద్దు తర్వాత భారత క్రికెటర్ స్మృతి తొలిసారి మీడియాకు కనిపించారు. ఈ నెల 21 నుంచి శ్రీలంకతో జరిగే T20 సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది. కాగా పెళ్లి రద్దుపై తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రాక్టీస్ను ఉద్దేశించి ‘స్మృతి ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News December 8, 2025
MIDHANIలో 210 పోస్టులు.. అప్లై చేశారా?

మిశ్రమ ధాతు నిగమ్(MIDHANI)లో 210 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE, బీటెక్, ITI, డిప్లొమా అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. ITI ట్రేడ్ అప్రెంటిస్కు నెలకు రూ.9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్కు రూ.10,900 చెల్లిస్తారు.
News December 8, 2025
విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారా?

శ్రీవారితో పాటు ఆలయ గోపురంపై ఉన్న విమాన వేంకటేశ్వరుడికీ అంతే ప్రత్యేకత ఉంటుందని చాలామంది భక్తులకు తెలిసుండదు. తిరుమలకు వెళ్లినవారు ఇరువురినీ తప్పక దర్శించుకోవాలని <<18475056>>పురోహితులు<<>> సూచిస్తున్నారు. ఆనంద నిలయంపై వాయవ్య మూలన వెండి మకర తోరణంతో ఉన్న మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విమాన వేంకటేశ్వరుడి విగ్రహం ఉంటుంది. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ విగ్రహం వద్ద ధ్యానం చేసి మోక్షం పొందారని ప్రతీతి.


