News November 21, 2024

కార్మికుడిగా పనిచేస్తూ NEETలో 677 స్కోర్

image

కోచింగ్ తీసుకుని, 18 గంటలు చదివినా కొందరు నీట్ పరీక్ష ఫెయిల్ అవుతుంటారు. కానీ, స్క్రీన్ పగిలిన ఫోన్‌లో చదువుతూ 21 ఏళ్ల కార్మికుడు నీట్‌ను ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్ఫరాజ్ నీట్ యూజీలో 720కి 677 స్కోరుతో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈయన రోజూ 8 గంటలు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే సాయంత్రం చదువుకునేవారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు.

Similar News

News December 15, 2025

ఖమ్మం జిల్లాలో TDP మద్దతుదారు విజయం

image

TG: ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ సొంతం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి అజ్మీర బుల్లి విజయం సాధించారు. బీజేపీ, BRS, జనసేన పార్టీల మద్దతుతో గెలిచినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం ఆమె భర్త హరినాయక్ సర్పంచ్‌గా గెలవగా, ఇప్పుడు బుల్లి గెలుపొందారు. కాగా మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు మూడు పంచాయతీలను సొంతం చేసుకున్నారు.

News December 14, 2025

సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

image

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్‌లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.

News December 14, 2025

భారత్‌లోనూ ఉగ్ర దాడులకు కుట్ర?

image

ఆస్ట్రేలియాలో <<18562319>>కాల్పుల<<>> నేపథ్యంతో భారత్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు టెర్రర్ గ్రూపులు కుట్ర చేస్తున్నట్లు తెలిపాయి. హనుక్కా పండుగ సందర్భంగా యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు.