News November 21, 2024

కార్మికుడిగా పనిచేస్తూ NEETలో 677 స్కోర్

image

కోచింగ్ తీసుకుని, 18 గంటలు చదివినా కొందరు నీట్ పరీక్ష ఫెయిల్ అవుతుంటారు. కానీ, స్క్రీన్ పగిలిన ఫోన్‌లో చదువుతూ 21 ఏళ్ల కార్మికుడు నీట్‌ను ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్ఫరాజ్ నీట్ యూజీలో 720కి 677 స్కోరుతో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈయన రోజూ 8 గంటలు గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూనే సాయంత్రం చదువుకునేవారు. చదువు తమ జీవితాన్ని మారుస్తుందని ఆయన నమ్ముతున్నారు.

Similar News

News December 11, 2025

ఆలయ ప్రవేశం.. ఆరోగ్య కారకం!

image

గుడికి వెళ్లినప్పుడు చెప్పులను బయటే వదిలేస్తాం. దీనివల్ల ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించదు. దేవాలయ ప్రాంగణంలో ఒట్టి కాళ్లతో నడవడం వల్ల నేలలోని పాజిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా శరీరమంతా వ్యాపించి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దేవతా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అందులో కూడా శక్తిమంతమైన అయస్కాంత శక్తి నిలుస్తుంది. దైవ దర్శనంతో ఆ శక్తి మనలోకి ప్రవేశించి, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.

News December 11, 2025

నేటి నుంచి బీజేపీ బస్సు యాత్ర

image

AP: మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఇవాళ్టి నుంచి ‘అటల్-మోదీ సుపరిపాలన’ బస్సు యాత్ర చేయనుంది. రాయలసీమలోని ధర్మవరం నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మోదీ ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటన అనంతరం ఈ నెల 25న అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొననున్నారు.

News December 11, 2025

నేడు ఆ స్కూళ్లకు సెలవు

image

TG: రాష్ట్రంలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లకు గానూ నిన్న కూడా ఈ పాఠశాలలకు హాలిడే ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13, 14.. 16, 17 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఆయా బడుల్లో అదనపు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.