News June 28, 2024
SDNR: పరిశ్రమలో పేలుడు.. భయానక దృశ్యాలు

షాద్నగర్లోని సౌత్ గ్లాసు కంపెనీలో సంభవించిన భారీ ప్రమాదంలో భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. కంప్రెషర్ పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఒక్కొక్క భాగం ఒక్కొక్కచోట ఎగిరిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కార్మిక నేత తెలిపారు. ఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ రాజేశ్ పరిశీలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు మృతిచెందగా పలువురు షాద్ నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.
News November 30, 2025
ALERT: ప్రజావాణి రద్దు: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.
News November 30, 2025
MBNR: నామినేషన్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేసేందుకు భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ డి.జానకి కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండో విడత నామినేషన్ కేంద్రాలైన కోయిలకొండ, సంగినోని పల్లి, ఎల్లారెడ్డిపల్లి, మోదీపూర్, శేరివెంకటపూర్, సూరారం, ఖాజీపూర్ గ్రామాలను వరుసగా సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సై తిరుపాజి పాల్గొన్నారు.


