News December 3, 2025

SDPT: 4 లైన్లకు నేడు సీఎం శంకుస్థాపన

image

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న అక్కన్నపేట రహదారిని 4 లైన్ల రోడ్డుగా మార్చడానికి ప్రభుత్వం సిద్ధమైంది. హుస్నాబాద్-అక్కన్నపేట వరకు నాలుగు లైన్ల రోడ్డుకు, రాజీవ్ రహదారి నుంచి కొత్తపల్లి హుస్నాబాద్ వరకు నాలుగు లైన్లో రోడ్డుకు నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్లకు మహార్దశ రానుంది.

Similar News

News December 4, 2025

కల్వకుర్తి: సర్పంచ్ ఎన్నికల బరిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు

image

కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు తలసాని వెంకట చల్మారెడ్డి నిలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్డ్ అయిన నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు Way2Newsకు తెలిపారు.

News December 4, 2025

కృష్ణా తరంగ్-2025ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు

image

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్-2025 (యూత్ ఫెస్టివల్)ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమం మెుదలుపెట్టారు. అనంతరం ఎన్.సీ.సీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఉపకులపతి ఆచార్య రాంజీ, తదితరులు పాల్గొన్నారు.

News December 4, 2025

వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

image

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT