News March 11, 2025

అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయ్: రాజ్‌నాథ్ సింగ్

image

డీలిమిటిషన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని, తమిళనాడులో కూడా పెరుగుతాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘నియోజకర్గాల పునర్విభజనలో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందనేది అపోహే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది. దీనికి అందరి సలహాలు స్వీకరిస్తాం’ అని చెప్పారు.

Similar News

News April 5, 2026

TODAY HEADLINES

image

*దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోవు: మోదీ
*ఏపీ కొత్త మ్యాప్ విడుదల
*₹57,821 కోట్లతో అమరావతి నిర్మాణాలు: CBN
*ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: రేవంత్
*అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ
*రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
*48 గంటల్లో హార్ముజ్‌ను తెరవకపోతే ప్రళయమే: ట్రంప్
*IPL: ముంబైపై ఢిల్లీ, గుజరాత్‌పై రాజస్థాన్ గెలుపు

News April 5, 2026

ఈవెంట్‌లో సినీతారలు.. మరోసారి డ్రగ్స్ కలకలం

image

TG: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గోల్కొండ తారామతి రిసార్టులో జాక్ జాన్సన్ ఈవెంట్‌పై ఈగల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి తనిఖీలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పలువురు సినీతారలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏడుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇందులో పాల్గొన్న వారందరికీ పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News April 4, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

image

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.