News June 20, 2024
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఇ-స్కూటర్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా ₹5,500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (యాజమాన్యానికి చెందిన షేర్లు విక్రయించడం) ద్వారా ₹1750 కోట్లు రాబట్టాలని సంస్థ భావిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ 47.3 మిలియన్ షేర్లను విక్రయించనున్నారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కేపెక్స్ పెంచేందుకు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 9, 2026
చరిత్ర సృష్టించిన రుతురాజ్

లిస్టు-A క్రికెట్లో రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక బ్యాటింగ్ యావరేజ్(58.83) నమోదుచేసిన ఆటగాడిగా నిలిచారు. ఇతను 99 మ్యాచ్లలో 5,060 రన్స్ చేశారు. ఇందులో 20 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బెవాన్(57.86), హెయిన్(57.76), కోహ్లీ(57.67) ఉన్నారు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో అతి తక్కువ(59) మ్యాచుల్లో 15 శతకాలు బాదిన ప్లేయర్గా రుతురాజ్ రికార్డుల్లోకెక్కారు.
News January 9, 2026
HYD-VJA హైవేపై ప్రయాణిస్తున్నారా?

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. ఇకపై ఈ మార్గంలోని టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ గేట్ వద్ద శాటిలైట్ ద్వారా టోల్ ఫీజు వసూల్ కోసం హైవే అధికారులు ట్రయల్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో శాటిలైట్ విధానం అమల్లోకి వస్తే ఈ రూట్లో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ రద్దీ, జామ్ సమస్యలు తీరే అవకాశం ఉంది.
News January 9, 2026
దైవాన్ని ఎలా నమస్కరించాలంటే?

గుడికి వెళ్లినప్పుడు దేవుడికి ఎలా నమస్కరించాలో శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. చాలామంది గర్భాలయంలోని మూలమూర్తికి ఎదురుగా నిలబడి దండం పెట్టుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఒక పక్కకు నిలబడే వేడుకోవాలి. గర్భాలయంలో అర్చకులు కుడివైపున ఉండి పూజలు చేస్తారు కాబట్టి, భక్తులు ఎడమ పక్కన నిలబడిటం మంచిది. అలాగే స్వామికి ఎదురుగా ఉండే నంది, గరుత్మంతుడికి మధ్యలో అడ్డుగా నిలబడకూడదని పండితులు చెబుతుంటారు.


