News July 2, 2024
హిండెన్బర్గ్కు సెబీ నోటీసులు

గతఏడాది అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ కుట్రపూరితంగానే రిపోర్ట్ రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ సెబీ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ‘అదానీ FPO లాంచ్ అయ్యే టైమ్లోనే ఈ రిపోర్ట్ వచ్చింది. దీనికి ముందు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో షార్ట్ సెల్లింగ్ (ముందు షేర్లు విక్రయించి ఆ తర్వాత వాటి విలువ తగ్గాక మళ్లీ కొనడం) జరిగింది. రిపోర్ట్ తర్వాత AEL షేర్ల విలువ 59% పడిపోయింది’ అని పేర్కొంది.
Similar News
News April 18, 2026
వెనుకబడితే షోకాజ్ నోటీస్: కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలో జలధార కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్య సాధనలో వెనకబడిన ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పరిషత్ సీఈఓను ఆదేశించారు.
News April 18, 2026
వెనుకబడితే షోకాజ్ నోటీస్: కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలో జలధార కార్యక్రమం కింద చేపట్టిన నీటి సంరక్షణ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యతా లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్య సాధనలో వెనకబడిన ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పరిషత్ సీఈఓను ఆదేశించారు.
News April 18, 2026
KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.


