News January 23, 2026
SEC: మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

సమ్మక్క-సారలమ్మ జాతర భక్తుల రద్దీని దృష్యా SCR 28 అన్రిజర్వ్డ్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు JAN 28 నుంచి FEB 1 వరకు SEC, NZB, ADB, KMM నుంచి వరంగల్, కాజీపేటకు నడవనున్నాయి.
రూట్లు: SEC- మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్, నిజామాబాద్- WGL, కాజీపేట- ఖమ్మం, ఆదిలాబాద్- కాజీపేట మధ్య
స్టాపులు: మౌలాలి, ఘట్కేసర్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్ వంటి కీలక స్టేషన్లు
టైమింగ్: ఉ.5:45 నుంచి అర్ధరాత్రి వరకు
Similar News
News February 18, 2026
జూపార్క్: ఇండియాలోనే కాస్ట్ లీ టికెట్ ధర!

జూ పార్కులో సాధారణ ఎంట్రీ ఫీజు కేవలం రూ.100 (పెద్దలకు) మాత్రమే ఉంది. కానీ, <<19174320>>ఈ అండర్<<>> వాటర్ టన్నెల్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పని. గుజరాత్ సైన్స్ సిటీలోని ఇలాంటి టన్నెల్ అక్వేరియం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 పైన ఉంది. హైదరాబాద్లో దీనిని మరింత అత్యాధునికంగా నిర్మిస్తున్నందున నిర్వహణ ఖర్చుల దృష్ట్యా టికెట్ ధర రూ. 300 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.
News February 18, 2026
గోల్కొండ గెస్ట్ హౌస్లో సామాన్యుడికి ‘నో ఎంట్రీ’

సర్కారు వారి ‘వారసత్వ’ వ్యాపారం ముదిరి పాకాన పడింది. చారిత్రక గోల్కొండ గెస్ట్ హౌస్ను సామాన్యులకు దూరం చేస్తూ కేవలం బడా బాబులకే పరిమితం చేసేలా పర్యాటక శాఖ పావులు కదుపుతోంది. ‘బ్యూటిక్ హోటల్స్’ పేరుతో ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్న ఈ ఆస్తులు ఇకపై “ఇన్విటేషన్ ఓన్లీ” క్లబ్బులుగా మారబోతున్నాయి. గండిపేట రిసార్టుల్లో రూమ్ కావాలంటే పైస్థాయి రికమండేషన్ ఉండాల్సిందే అన్నట్లుగా నిబంధనలు మారుస్తున్నారు.
News February 18, 2026
HYD: షాద్నగర్ యాక్సిడెంట్లో చనిపోయింది వీరే..!

షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172186>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.


