News October 4, 2025
స్థానిక ఎన్నికలపై SEC కాల్ సెంటర్

TG: స్థానిక ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు నివేదించినందున SEC తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. BC రిజర్వేషన్లపై ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలకు అనుమతిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు కష్టమవుతుందనే కొన్ని ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు స్వీకరించేందుకు 92400 21456 నంబర్తో తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
Similar News
News October 5, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు జమ
* కూటమి నేతలతో కలిసే వెళ్లాలి: పవన్
* TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్
* HYD, SEC పరిధిలో ఛార్జీలు పెంచిన TGSRTC
* అన్ క్లెయిమ్డ్ మొత్తం ₹1.84 లక్షల కోట్లు: నిర్మల
* ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
* టీమ్ ఇండియా వన్డే కెప్టెన్గా గిల్
* తొలి టెస్టులో విండీస్పై భారత్ విజయం
News October 5, 2025
80’s రీయూనియన్.. చెన్నైకి చిరు, వెంకీ

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి చెన్నై వెళ్లారు. అక్కడ జరిగే 80’s రీయూనియన్లో వారు పాల్గొననున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. 80వ దశకంలో కలిసి నటించిన హీరోలు, హీరోయిన్లు ఒకే చోట కలవనున్నారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడుపుతారు. గతంలోనూ ఇలా చాలా సార్లు కలిశారు. కాగా ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ మామ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు.
News October 5, 2025
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు కమిటీ వేసిన BJP

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు పార్టీ తరఫున ఎవరిని నిలబెడితే బాగుంటుందో నేతల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను సేకరిస్తుంది. M.ధర్మారావ్(Ex. MLA), పోతుగంటి రాములు(Ex.MP), బీజేపీ సీనియర్ నేత కోమల ఆంజనేయులు(అడ్వకేట్)ను కమిటీ సభ్యులుగా నియమించారు.