News March 18, 2024
రెండో రోజు కవిత ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ్టి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బంది ఈడీకి బదులిచ్చారు. ఇక కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.
Similar News
News December 16, 2025
మోదీతో భేటీ అంశాలు లీక్.. కిషన్ రెడ్డి ఆగ్రహం

ప్రధాని మోదీతో తెలంగాణ BJP MPల సమావేశానికి <<18530988>>సంబంధించిన లీకులపై<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘PMతో భేటీ విషయాలను లీక్ చేసిన వ్యక్తులు మెంటల్ వాళ్లు. మీటింగ్ విషయాలు బయట చెప్పొద్దని PM చెప్పారు. అయినా వాటిని లీక్ చేశారు. వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు’ అని మీడియాతో చిట్చాట్లో పేర్కొన్నారు.
News December 16, 2025
ఎగ్జామ్ ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఫస్ట్, సెకండియర్ చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టింది. రూ.5వేల ఫైన్తో ఈ నెల 22 నుంచి JAN 5 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గత నెలలోనే గడువు ముగిసింది.
News December 16, 2025
పెళ్లి వార్తలను ఖండించిన హీరోయిన్ మెహ్రీన్

తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను హీరోయిన్ మెహ్రీన్ ఖండించారు. ఓ వ్యక్తితో తనకు పెళ్లి జరగబోతున్నట్లు ఆర్టికల్స్ రాశారని, కానీ అతనెవరో తనకు తెలియదని, ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. ఒకవేళ తాను నిజంగా మ్యారేజ్ చేసుకుంటే అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నారు. ఫేక్ ఆర్టికల్స్ రాయడంపై ఫైరయ్యారు. పొలిటీషియన్ భవ్య బిష్ణోయ్తో ఆమెకు 2021లో ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత పెళ్లి రద్దయింది.


