News November 1, 2024
SPF భద్రత వలయంలో సచివాలయం

తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలను నేటి నుంచి SPF(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) చూసుకోనుంది. గతంలో TGSP బెటాలియన్కు చెందిన సిబ్బంది సచివాలయ భద్రతను చూసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఈ బాధ్యతలు SPF చూసుకునేది. BRS ప్రభుత్వం TGSPకి అప్పగించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సచివాలయ బాధ్యతలను SPFకు అప్పగించింది.
Similar News
News April 1, 2026
ముగిసిన CM పర్యటన.. కలెక్టర్, SP అభినందనలు

నెల్లూరు జిల్లా వింజమూరులో CM చంద్రబాబు పర్యటన ముగిసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినా పోలీసు సిబ్బందిని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అభినందించారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ సూచనలతో ట్రాఫిక్, వీవీఐపీ రూట్ భద్రతను పకడ్బందీగా పర్యవేక్షించామన్నారు. మరోవైపు సిబ్బందిని కలెక్టర్ హిమాన్షు శుక్లా అభినందించారు.
News April 1, 2026
పెరిగిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

విమాన ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి టికెట్ బుకింగ్స్పై ఇంధన ఛార్జీలను సవరించనున్నట్లు ప్రకటించింది. దూరాన్ని బట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్లో ₹275-₹950, ఇంటర్నేషనల్ సర్వీసులలో ₹900-₹10,000 వరకు ఫ్యూయల్ ఛార్జెస్ పెరుగుతాయని తెలిపింది. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు 25%, ఇంటర్నేషనల్ సర్వీసెస్పై 100% ఇంధన ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
News April 1, 2026
LokPoll సర్వే.. మళ్లీ డీఎంకేదే అధికారం!

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని LokPoll సర్వే వెల్లడించింది. DMK+కు 40.1% ఓట్లతో 181–189 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 29% ఓట్లు, 38-42 సీట్లు, విజయ్ నేతృత్వంలోని TVK 23.9% ఓట్లు, 8-10 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఇక సీఎంగా స్టాలిన్కు 41%, విజయ్కి 27.1%, పళనిస్వామికి 24.1% మంది మద్దతు పలికారని తెలిపింది.
<<-se>>#ELECTIONS2026<<>>


