News March 18, 2024
సికింద్రాబాద్ సీటు.. VERY హాట్

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.
Similar News
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్లో చూసుకోవాలని సూచించారు.
News April 20, 2025
HYD: క్రికెట్ బెట్టింగ్ భూతానికి యువకుడి బలి

క్రికెట్ బెట్టింగ్ కారణంగా మియాపూర్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం.. మియాపూర్ PS పరిధిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న గణేశ్(26) ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టుకొవడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
News April 19, 2025
OU: 24 నుంచి బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ కోర్సుల నాలుగు, ఆరో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.