News March 18, 2024
సికింద్రాబాద్ సీటు.. VERY హాట్

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్కుమార్ యాదవ్కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.
Similar News
News November 13, 2025
HYD: నేడే ఫీజు చెల్లింపులకు లాస్ట్..!

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.
News November 13, 2025
అధికారికంగా జూబ్లీహిల్స్లో 48.49% ఓటింగ్

జూబ్లీహల్స్ బైపోల్ వివరాలు అధికారికంగా వెల్లిడించారు. మొత్తం 4,01,365 మంది ఓటర్లలో పురుషులు 2,08,561 మంది ఉండగావారిలో 99,771 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా 94,855 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 25 మంది ఉండగా ఐదుగురు ఓటింగ్లో పాల్గొన్నారు. మొత్తంగా 1,94,631 మంది ఓటేశారని అధికారికంగా గణాకాంలు ఇవాళ విడుదల అయ్యాయి. 48.49%తో అతి తక్కువ ఓటింగ్ మనవద్దే నమోదు కావడం గమనార్హం.
News November 13, 2025
HYD: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు

చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని.. దాని అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా CSR సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CSR నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


