News April 20, 2024

నేతలకు భద్రత కట్టుదిట్టం

image

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని రాజకీయ నాయకులకు పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతలు ముందుగా తమకు సమాచారం అందించాలని, భద్రతతోనే క్యాంపెయినింగ్ నిర్వహించాలని నేతలకు స్పష్టం చేశారు. ఇటీవలి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా మావోయిస్టులు దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Similar News

News March 7, 2026

‘పుష్పక్’ వచ్చేస్తోంది.. హార్ముజ్ దాటిన భారత నౌక

image

యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ రవాణా చేసే వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయాయి. సోమవారం నుంచి కేవలం 9 ఓడలు మాత్రమే జలసంధిని దాటాయి. ఇందులో భారత్‌కు చెందిన ‘పుష్పక్’ కూడా ఉంది. ఇది పెట్రోలియం ఉత్పత్తులను ఇండియాకు తీసుకొస్తోంది. దీంతో దేశంలో ఇంధన నిల్వలకు మరింత బూస్ట్ రానుంది.

News March 7, 2026

మెదడును చురుగ్గా పనిచేయించే ‘కోకో’

image

కోకో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలోని ఫ్లావనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, మెదడుకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఫలితంగా ఏకాగ్రత పెరగడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, మానసిక అలసట తగ్గుతుందని పేర్కొన్నారు. రోజుకు 3 చెంచాల కోకో పౌడర్‌ను పాలు/ నీటిలో కలుపుకుని తాగితే మెదడు మరింత చురుగ్గా మారుతుందని సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్‌లోనూ కోకో ఉంటుంది.

News March 7, 2026

ఇరాన్‌లో మరోసారి భూకంపం

image

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.