News October 20, 2024
మరణశిక్ష పడేలా చూడండి: సీఎం చంద్రబాబు
AP: బద్వేల్ ఘటనలో యువతి <<14403526>>చనిపోవడంపై <<>>సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘విచారణ పూర్తి చేసి, నిందితుడికి మరణశిక్ష పడేలా చేయాలి. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి’ అని ఆయన అధికారులను ఆదేశించారు.
Similar News
News October 20, 2024
రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు
న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిచ్ను ఆయన సరిగా అంచనా వేయలేదని, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశారని అంటున్నారు. NZ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలోనూ బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని, అశ్విన్కు చివర్లో బౌలింగ్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ‘CLUELESS CAPTAIN ROHIT’ అని Xలో ట్రెండ్ చేస్తున్నారు.
News October 20, 2024
ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం
రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 20, 2024
MH: MLA అభ్యర్థుల జాబితా విడుదల చేసిన BJP
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేేసే అభ్యర్థుల జాబితాను BJP విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 99 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. కాగా నవంబర్ 20న పోలింగ్ జరగాల్సి ఉంది.