News September 28, 2024
హర్షసాయి దేశం వదిలి వెళ్లకుండా చూడండి: బాధితురాలు

యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అతడు దేశం వదిలి వెళ్లకుండా చూడాలని బాధితురాలు సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసు జారీచేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీపీని కోరారు.
Similar News
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
News September 14, 2025
ఇవాళ అస్సాం, రేపు ప.బెంగాల్లో PM పర్యటన

PM మోదీ రాష్ట్రాల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇవాళ అస్సాంలో రూ.18,530 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అస్సాం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంటును ప్రారంభిస్తారు. రేపు PM ప.బెంగాల్లో పర్యటిస్తారు. కోల్కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025లో పాల్గొంటారు. ఆ తర్వాత బిహార్ వెళ్లి పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ను ప్రారంభిస్తారు.
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి బారినపడిన జీవాల్లో తొలుత లక్షణాలు ఎక్కువగా బయటకు కనిపించవు. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు విపరీతమైన జ్వరం వస్తుంది. మేత మేయకుండా గొర్రెలు నీరసపడతాయి. సరిగా నడవలేవు. నోటి నుంచి చొంగ కారుస్తూ, పళ్లు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. కొన్నిసార్లు చిటుక వ్యాధికి గురైన గొర్రె పిల్లలు చెంగున గాలిలోకి ఎగిరి, హఠాత్తుగా మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యులను సంప్రదించాలి.