News August 22, 2024
80 శాతం రాయితీతో విత్తనాలు

AP: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో సాధారణం(37 లక్షల ఎకరాలు) కంటే 15 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉలవ, పెసర, అలసందలు, జొన్న, మినుము, కొర్ర, సజ్జలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 8 జిల్లాల రైతులకు 69వేల క్వింటాళ్ల విత్తనాలు అందించనుంది.
Similar News
News November 27, 2025
హసీనా అప్పగింతపై పరిశీలిస్తున్నాం: భారత్

భారత్లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. తీవ్ర నేరాలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.
News November 27, 2025
ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

ఈ కింద సూచించిన ఆకుకూరల రకాలు మన ప్రాంతంలో సాగుకు అనుకూలం. వీటిని సరైన యాజమాన్యాన్ని పాటిస్తూ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
☛ కొత్తిమీర: సిందు సాధన, స్వాతి, సుధా, సుగుణ, సురచి(LCC-234), APHU ధనియా-1 (వేసవి రకం), సుస్థిర
☛ కరివేపాకు: సువాసిని, భువనేశ్వర్, సెంకంపు
☛ మునగ: జాఫ్నా(ఇది బహువార్షిక రకం), పి.కె.యం-1( ఇది ఏక వార్షిక రకం)
News November 27, 2025
ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు..

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః|
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||
విశ్వమంతా విష్ణువుతో నిండి ఉందని ఈ శ్లోకం ప్రకటిస్తుంది. ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు. ఈ జగత్తును సృష్టించి, భరించి, పోషించే శక్తిమంతుడు. సమస్త జీవులలో కొలువై ఉన్నాడు. సకల భూతాలకు ప్రాణమిచ్చి, పోషిస్తున్నాడు. అందుకే ఆయనను ఆరాధిస్తే వెంటనే అనుగ్రహించి, మన కష్టాలను దూరం చేస్తాడని అంతా నమ్ముతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


