News August 22, 2024
80 శాతం రాయితీతో విత్తనాలు

AP: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో సాధారణం(37 లక్షల ఎకరాలు) కంటే 15 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉలవ, పెసర, అలసందలు, జొన్న, మినుము, కొర్ర, సజ్జలను 80 శాతం సబ్సిడీపై పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.65 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 8 జిల్లాల రైతులకు 69వేల క్వింటాళ్ల విత్తనాలు అందించనుంది.
Similar News
News November 17, 2025
కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.
News November 17, 2025
‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.
News November 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్కు తెలుస్తుందని తెలిపారు. సూరత్లోని రైల్వే కారిడార్లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.


