News November 9, 2024
ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం

TG: కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ తరఫున మంత్రి సీతక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆమె రెండు, మూడు రోజులు అక్కడే ఉండి ఓట్లు అభ్యర్థించనున్నారు. కాగా నిన్నటివరకు సీతక్క మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
మ్యాచ్ రీస్టార్ట్.. 26 ఓవర్లకు కుదింపు

భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్కు వర్షం అంతరాయం కారణంగా అంపైర్లు ఓవర్లను 26కు కుదించారు. వర్షం కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్ రీస్టార్ట్ అయింది. 18 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 65 రన్స్ చేసింది. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలున్నాయి. అక్షర్(25*), రాహుల్ (5*) క్రీజులో ఉన్నారు. 26 ఓవర్లలో కనీసం 130 రన్స్ టార్గెట్ నిర్దేశిస్తేనే భారత్ పోరాడేందుకు అవకాశం ఉండనుంది.
News October 19, 2025
దూడలలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు

గేదె, సంకర జాతి దూడల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి సోకిన దూడలు తెల్లగా పారతాయి. దీని నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధికి గురైన దూడల శరీరం నుంచి నీరు కోల్పోయి కళ్లగుంటలు బాగా లోపలికి పోయి ఉంటాయి. చర్మము ముడతలు పడి ఉంటుంది. చివరకు వ్యాధి తీవ్రంగా మారితే దూడ ఎక్కువగా పారి నీరసించి చనిపోతుంది. అందుకే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన వెంటనే వెటర్నరీ వైద్యునికి చూపించాలి.
News October 19, 2025
రాష్ట్ర నేతలకు బండి సంజయ్ వార్నింగ్

TG: మావోయిస్టులకు మద్దతిస్తున్న రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ నక్సలైట్లకు మద్దతిస్తున్నవారు వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలి. కేంద్ర ఏజెన్సీలు మావోయిస్టుల విషయంలో వెనక్కి తగ్గవు. అవినీతి, నేరాలకు రక్షణ కల్పిస్తున్న వారిని కేంద్రం ట్రేస్ చేస్తోంది. దేశ భద్రత విషయంలో ఎంతటివారినైనా జాలి చూపకుండా ఏరివేస్తుంది’ అని ట్వీట్ చేశారు.