News March 31, 2025

సీఎస్కేపై సెహ్వాగ్ విమర్శలు

image

రాజస్థాన్‌తో సీఎస్కే ఓటమి అనంతరం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ జట్టుపై విమర్శలు గుప్పించారు. ‘క్రీజులో ఎంత పేరున్న ఆటగాడున్నా 2 ఓవర్లలో 40 పరుగులు చేయడమనేది కష్టమైనపని. ఏదో ఒకట్రెండు సార్లు మాత్రమే అది సాధ్యం. అక్షర్, పఠాన్ బౌలింగ్‌లో ధోనీ అప్పుడెప్పుడో 2సార్లు ఛేజ్ చేశారు. అలాంటివి తరచూ జరగవు. నాకు తెలిసి గడచిన ఐదేళ్లలో సీఎస్కే 180కి పైగా పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2025

వక్ఫ్ సవరణ బిల్లు.. మీ అభిప్రాయం?

image

వక్ఫ్ అంటే ముస్లింలు చేసే దానం. ఎక్కువగా స్థిరాస్తి రూపంలోనే ఉంటుంది. 9.4 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని అంచనా. వాటిలో చాలావాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదమవుతోంది. ఒక ఆస్తిని వక్ఫ్‌గా నిర్ణయిస్తే దానిపై సర్వాధికారాలు వక్ఫ్ బోర్డువే. ఆ అధికారాల్ని తగ్గించి బోర్డుల్ని చట్టం పరిధిలోకి మరింతగా తీసుకొచ్చేలా కేంద్రం నేడు బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆ సవరణపై మీ అభిప్రాయం? కామెంట్ చేయండి.

News April 2, 2025

దేశంలో 13వేల చదరపు కి.మీ.ల అటవీ భూముల కబ్జా

image

దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13వేల చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా MPలో 5,460.9 Sqkm భూములు కబ్జాకు గురైనట్లు నివేదికలో తెలిపింది. APలో 133.18 చదరపు కి.మీల భూమి ఆక్రమణకు గురైందని పేర్కొంది. మొత్తం ఆక్రమిత భూముల్లో 409.77 Sqkm తిరిగి స్వాధీనం చేసుకున్నామంది. కాగా తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ వివరాలు ఇవ్వలేదని తెలిపింది.

News April 2, 2025

ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అలాగే గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

error: Content is protected !!