News April 6, 2024
సెహ్వాగ్కి వారసుడయ్యేనా?

భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ది ఓ ప్రత్యేక స్థానం. అతడి రిటైర్మెంట్ తర్వాత.. వీరూ లాంటి డేరింగ్&డ్యాషింగ్ ఓపెనర్ను టీమ్ తయారు చేసుకోలేకపోయింది. అయితే SRH బ్యాటర్ అభిషేక్శర్మ ఆ లోటు తీర్చేలా కనిపిస్తున్నారు. ఈ యువ కెరటం బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఈ సీజన్లో ఆడిన 4మ్యాచుల్లో 32రన్స్(19బంతుల్లో), 63(23), 29(20), 37(12) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నారు.
Similar News
News November 4, 2025
ఆ ఊర్లో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే..

TG: జగిత్యాల(D) వెల్లుల్ల అనే గ్రామంలో ఏ మూల చూసినా, ఏ వాడ తిరిగినా ఆంజనేయుడి గుళ్లే దర్శనమిస్తాయి. 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న ఈ ఊర్లో దాదాపు 45 హనుమాన్ ఆలయాలున్నాయి. పూర్వం ఇక్కడ నివాసమున్న బ్రాహ్మణ కుటుంబాలు తమ వంశాల వారీగా ఎవరికి వారు ఈ ఆలయాలను నిర్మించుకున్నారట. ఈ అన్ని ఆలయాల్లోనూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించడం విశేషం. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 4, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

ఇటీవల భారీ వర్షాలకు మానిపండు తెగులు వరి పంటను ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News November 4, 2025
పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు

AP: రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల <<17768393>>పని<<>> గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచింది. నిన్నటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వారం మొత్తంలో పని గంటలు 48 దాటితే ఓటీ కింద అదనపు మొత్తాన్ని చెల్లించాలని ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట సవరణ చేశారు. మరోవైపు ఐదు మంది కంటే ఎక్కువ మహిళలుంటేనే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.


