News November 29, 2024
500 కేజీల డ్రగ్స్ పట్టివేత

అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. భారత నేవీ 500 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకుంది. ఫిషింగ్ బోట్లలో డ్రగ్స్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక నేవీతో కలిసి భారత నౌకాదళం ఈ ఆపరేషన్ చేపట్టింది.
Similar News
News November 21, 2025
జక్కన్నపై దేవుడికి లేని కోపం మీకెందుకు: RGV

నాస్తికుడిగా ఉండటం నేరం కాదని రాజమౌళిపై విషం చిమ్మేవారు తెలుసుకోవాలని RGV పేర్కొన్నారు. ‘దేవుణ్ని నమ్మనివాడు ఆయనపై మూవీ తీయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్స్టర్ మూవీ తీయాలంటే డైరెక్టర్ గ్యాంగ్స్టర్ అవ్వాలా? నిజమేంటంటే నమ్మని వ్యక్తికే దేవుడు వందరెట్లెక్కువ సక్సెస్ ఇచ్చాడు. అంటే దేవుడు మీ కంటే నాస్తికులనే ఎక్కువ ప్రేమిస్తుండాలి. మరి రాజమౌళితో దేవుడికిలేని ఇబ్బంది మీకెందుకు’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
రాష్ట్రంలో 32మంది IPSల బదిలీ

TG: పంచాయతీ ఎన్నికల వేళ 32మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ADG పర్సనల్గా చౌహాన్, CID DIGగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ SPగా పద్మ, నాగర్ కర్నూల్ SPగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ DCPగా కిరణ్ కారే, వనపర్తి SPగా సునీత, మల్కాజ్గిరి DCPగా శ్రీధర్, ఆసిఫాబాద్ SPగా నిఖితా పంత్, TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో SPగా గిరిధర్ తదితరులు బదిలీ అయ్యారు.
News November 21, 2025
మత్స్యకారులకు అండగా వైసీపీ: జగన్

AP: మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని YCP అధ్యక్షుడు జగన్ తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. వారి సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.


