News February 19, 2025

సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

image

AP: ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్‌పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.

Similar News

News September 18, 2025

అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

image

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.

News September 18, 2025

బంధాలకు భయపడుతున్నారా?

image

గామోఫోబియా అనేది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్‌మెంట్‌కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.

News September 18, 2025

ప్రపంచ వెదురు దినోత్సవం – చరిత్ర

image

ప్రపంచ వెదురు సంస్థ(WBO) 8వ సమావేశం బ్యాంకాక్‌లో 2009లో జరిగింది. దీనికి 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వెదురు ప్రాధాన్యతను గుర్తించి ఏటా సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించగా.. ప్రతినిధులంతా ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా SEP-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తూ.. వెదురు ప్రాముఖ్యత, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరిస్తున్నారు.