News June 27, 2024

SEMI FINAL: వారిని త్వరగా ఔట్ చేస్తేనే..

image

T20WC రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఆ జట్టు బౌలింగ్‌ కంటే బ్యాటింగ్‌ పరంగానే బలంగా ఉంది. ఓపెనర్లు బట్లర్(191 రన్స్), ఫిల్ సాల్ట్(183రన్స్)ను ఎంత త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు అంత విజయావకాశాలుంటాయి. వీరితో పాటు మిడిలార్డర్‌లో భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే హ్యారీ బ్రూక్(120రన్స్) కూడా ప్రమాదకరమే. వీళ్లను అడ్డుకోవడంపై భారత బౌలర్లు దృష్టి పెట్టాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

2027 WCకు రోహిత్, కోహ్లీ.. కోచ్ ఏమన్నారంటే?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉందని టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డారు. పెద్ద టోర్నీల్లో వారి అనుభవం జట్టుకు కీలకమని అన్నారు. శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉంటే కచ్చితంగా ఆడతారని తెలిపారు. కాగా గత ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్ రాణించిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి SAతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు.

News November 28, 2025

అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్: నారాయణ

image

AP: అమరావతిలో రైల్వేస్టేష‌న్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కోస‌మే మరో 16వేల ఎకరాలను సమీకరిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్ లేనిదే రాజధాని అభివృద్ధి చెంద‌దని.. అందుకే ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ క‌ట్టాల‌ని సీఎం నిర్ణ‌యించార‌న్నారు. గ‌తంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎక‌రాలు మాత్ర‌మే కేటాయించగా ఇప్పుడు 2,500 ఎక‌రాలు ఇచ్చామని వివరించారు.

News November 28, 2025

డిసెంబర్ పెన్షన్లకు రూ.2,739 కోట్లు విడుదల

image

AP: సీఎం చంద్రబాబు డిసెంబర్ 1న ఏలూరు జిల్లా గోపాలపురంలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. DEC పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,738.71 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,25,999 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో నూతనంగా 8,190 పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.21,280 కోట్లు అందజేశామని వివరించారు.