News October 29, 2024

టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబూమోహన్

image

TG: సీనియర్ నటుడు బాబూమోహన్ TDP సభ్యత్వం తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో మెంబర్షిప్ తీసుకున్నట్లు తెలిపారు. ఆగస్టులో బాబూమోహన్ చంద్రబాబును కలిసి భావోద్వేగానికి గురయ్యారు. బాబూమోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1999లోనూ విజయం సాధించి, మంత్రి అయ్యారు. అనంతరం TRSలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Similar News

News January 6, 2026

ట్యూటర్ నుంచి వ్యాపారం వైపు అడుగులు

image

సుజాతా అగర్వాల్ హోమ్ సైన్స్‌లో పీజీ చేశారు. పెళ్లి తర్వాత గార్డెనింగ్‌పై మక్కువతో తొలుత ఇంటి దగ్గరే పూల మొక్కలు పెంచుతూ పిల్లలకు ట్యూషన్ చేప్పేవారు. కరోనాలో ఇంటికే పరిమితం కావడంతో ఇంటర్‌నెట్‌లో హైడ్రోపోనిక్స్(మట్టి లేకుండా కేవలం నీటితోనే పంటలు పండించడం) వ్యవసాయ పద్ధతి గురించి తెలుసుకొని, అధ్యయనం చేసి కూరగాయలు పండించాలనుకున్నారు. దానికి అవసరమైన కిట్ కొని దాన్ని ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేశారు.

News January 6, 2026

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.600 పెరిగి రూ.1,38,820కు చేరింది. రెండ్రోజుల్లోనే రూ.3వేలు పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.550 ఎగబాకి రూ.1,27,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.6,000 పెరిగి రూ.2,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 6, 2026

మేడారం జాతర: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

image

TG: మేడారం జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ ఆఫీసర్లను సెక్టోరల్ కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా ఈ నెల 24న ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్ చేసి, ఫిబ్రవరి 2 వరకు విధుల్లో ఉండాలి.