News June 4, 2024
సంచలనం.. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఓటమి

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా ఓటమిపాలయ్యారు. ధర్మాన, సీదిరి, బొత్స, రాజన్నదొర, అమర్నాథ్, బూడి, విశ్వరూప్, వేణు, దాడిశెట్టి, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, రజనీ, అంబటి, ఆదిమూలపు, కాకాణి, బుగ్గన, నారాయణస్వామి, ఉషశ్రీ, రోజా, అంజాద్ బాషా ఓడిపోయారు. గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి గెలిచారు.
Similar News
News December 24, 2025
హోటల్గా రుషికొండ ప్యాలెస్.. 28న నిర్ణయం?

AP: రుషికొండ ప్యాలెస్ను హోటల్గా మార్చే అవకాశం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఇందుకు తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రులు కేశవ్, దుర్గేశ్ వెల్లడించారు. ‘మాల్దీవ్, పుదుచ్చేరి బీచ్ హోటల్స్పై చర్చించాం. ప్రజలకు పనికొచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగిస్తాం. గత ప్రభుత్వ నిర్ణయంతో నెలకు ₹25L భారం పడుతోంది’ అని చెప్పారు. ఈ 28న మరోసారి చర్చిస్తామన్నారు.
News December 24, 2025
కేసీఆర్ Vs రేవంత్.. విమర్శల వే‘ఢీ’

తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామంటూ ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ నెల 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధమా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. దీన్ని KCR స్వీకరిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయన అసెంబ్లీకి వెళ్తే రేవంత్ Vs కేసీఆర్ మాటల యుద్ధంతో సభ దద్దరిల్లడం ఖాయం.
News December 24, 2025
బాధలు సరే.. బాధ్యత ఎవరిది?

ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే అలర్జీ వచ్చిందన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఢిల్లీ ప్రజల బాధకు ఉదాహరణ. కానీ కబళిస్తున్న ఈ కాలుష్యానికి బాధ్యులు ఎవరు? కట్టడి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు రాజకీయ అజెండాతో పనిచేస్తూ తప్పు తమది కాదన్నట్లు కౌంటర్ ఇస్తున్నాయి తప్ప కచ్చిత పరిష్కారాలు చూపడం లేదు. ఇదో సీజనల్ ఇష్యూగా చూస్తున్నాయి తప్ప యుద్ధంలా సీరియస్గా తీసుకోవట్లేదు. అదే జరిగితే తీవ్రత తప్పక తగ్గేది.


