News June 4, 2024
సంచలనం.. జైలు నుంచి పోటీ చేసి గెలిచాడు

‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ చీఫ్ అమృత్పాల్ సంచలన విజయం సాధించారు. ఖడూర్ సాహిబ్ నుంచి జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టైన పాల్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. మాజీ PM ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖస్లా(స్వతంత్ర) ఫరీద్కోట్లో 75 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Similar News
News January 14, 2026
టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్, RKపురంలోని <
News January 14, 2026
మోసపోయిన డైరెక్టర్ తేజ కుమారుడు

డైరెక్టర్ తేజ కుమారుడు అమితోవ్ తేజ భారీ మోసానికి గురయ్యారు. ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన దంపతులు రూ.63 లక్షలు కాజేశారనే ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్మార్కెట్ నిపుణులమంటూ పరిచయం పెంచుకున్న అనూష, ప్రణీత్ దంపతులు ఫేక్ ప్రాఫిట్స్ చూపించి నమ్మించారు. లాభాలు రాకపోగా పెట్టిన డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో అమితోవ్ పోలీసులను ఆశ్రయించారు.
News January 14, 2026
ఆధునిక యంత్రాలు వాడి అధిక ఆదాయం

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేశారు. డెయిరీ ఫామ్ను విస్తరించి ఈ ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


